మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ హెచ్చరిక.

0
201

మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు నేరస్తులు కావద్దని చింతూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) సంతోష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం చింతూరు మండలం చట్టి గ్రామంలో ఆటో మరియు బైక్ రైడర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.అవగాహన లేని వయసులో మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇది వారి ప్రాణాలకే కాకుండా ఇతరులకు కూడా ముప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు.ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు." అని ఎస్ఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు

 

# Yadagiri 

Search
Categories
Read More
Kerala
South Kerala Critical Mineral Corridor Project Advances
The Kerala government has accelerated plans for the South Kerala Critical Mineral Corridor, a...
By Navya Sree 2026-06-26 05:58:16 0 44
Andhra Pradesh
పుంగనూరు: కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు సంఘ సభ్యులు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ...
By Kothuru Murali 2026-05-03 16:26:25 0 95
Telangana
దస్తూరాబాద్: ‘ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి'
దస్తూరాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా...
By Mitappaly Shiavji 2026-01-03 08:05:53 0 500
Andhra Pradesh
సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో
సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో మార్కాపురం కలెక్టరేట్ లో జరుగుతున్న...
By Chennaiah Kati 2026-07-17 07:24:13 0 46
Andhra Pradesh
కలెక్టరేట్ వద్ద పోలీసుల తీరుపై సిపిఎం ఆగ్రహం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కు...
By Pagadala Venkateswar 2026-02-28 06:40:53 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com