మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ హెచ్చరిక.

0
199

మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు నేరస్తులు కావద్దని చింతూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) సంతోష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం చింతూరు మండలం చట్టి గ్రామంలో ఆటో మరియు బైక్ రైడర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.అవగాహన లేని వయసులో మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇది వారి ప్రాణాలకే కాకుండా ఇతరులకు కూడా ముప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు.ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు." అని ఎస్ఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు

 

# Yadagiri 

Search
Categories
Read More
Sikkim
International Pilgrimage Yatra Resumes via Sikkim in June 2025
After a five-year hiatus, the Kailash Mansarovar Yatra is slated to resume in June 2025, entering...
By Bharat Aawaz 2025-07-17 07:28:41 0 1K
Andhra Pradesh
గవినివారిపాలెం లో న్యాయ విజ్ఞాన సదస్సు*
చీరాల మండలం లోని గవినివారి పాలెం గ్రామం నందు ఒంగోలు ఇందిరా ప్రియధర్సిని న్యాయ కళాశాల ఆధ్వర్యం లో...
By Vadlamudi NagaVenkat 2026-04-17 05:23:39 0 220
SURAKSHA
The Unyielding Sentinel: A Journey of P. Sitaram Anjaneyulu
Service, Strategy, and the Weight of the Uniform: In the corridors of power and the intense...
By Kalaga Sailaja 2026-07-13 08:47:40 0 60
Andhra Pradesh
రాష్ట్రంలో గ్యాస్ ఇందన కొరతలేదు
రాష్ట్రంలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు • నెల రోజుల్లో లక్ష పీఎన్జీ కనెక్షన్లు...
By Rajini Kumari 2026-03-26 13:39:20 0 188
Andhra Pradesh
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సిపీ నాయకుల డిమాండ్.
మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సిపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. పార్టీ...
By Pagadala Venkateswar 2026-04-09 12:49:23 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com