Bangaraiah: కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్త మృతి.

0
165

Andhra

TDP Activist Dies in Clash with YSRCP in Kakinada District

కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్తత

దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు

 

గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో, ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందాడు. మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దుర్గా ప్రసాద్, శ్రీరామమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ కార్యకర్తలు నారాయణమూర్తి, సతీశ్ లకు కూడా తీవ్ర గాయాలు కావడంతో... వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. 

 

ఘర్షణ వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్తలు ఒక పుట్టినరోజు వేడుకకు వెళ్లి వస్తుండగా వారికి వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. పాత గొడవలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
రిటైర్డ్ ఉద్యోగుల భూమిని విడిపించి ఇవ్వాలి.. చిన్నప్ప.
మదనపల్లెకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఏపీఎస్ఈబీ...
By Pagadala Venkateswar 2026-05-22 12:49:18 0 42
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: బయో చెక్ కిట్లు ప్రారంభం.
అన్నమయ్య జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్...
By Pagadala Venkateswar 2026-05-15 05:47:49 0 48
Andhra Pradesh
“ఏపీ యువతకు హైదరాబాద్ & బెంగళూరు ఎందుకు ఫస్ట్ ఛాయిస్?”
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్...
By Babitha Babitha 2026-05-16 07:09:11 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com