హైదరాబాద్లో గాంధీ భవన్లో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
142

హైదరాబాద్‌ గాంధీ భవన్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు. ఇతర ఎంపీలు, డీసీసీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, బూత్ స్థాయిలో కేడర్‌ను చురుకుగా పనిచేయించే విధంగా ప్రణాళికలు రూపొందించాలి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలి, పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. ‘సంఘటన్ సృజన్ అభియాన్’ ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలపడుతుందని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం
ఓటుకు నోటు కేసులో  మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా...
By Ponnala Srinivasrao 2026-04-23 00:43:49 0 79
Telangana
కాదంతోక్కి కదలిరండి..... జర్నలిస్టుల భద్రతే లక్ష్యం
రాష్ట్ర కన్వీనర్లు పర్కాల సమ్మయ్య గౌడ్,  బజ్జుర్ల శ్రీనివాస్. జనవరి 5న హైదరాబాద్ ఉప్పల్లో...
By CM_ Krishna 2025-12-29 03:57:57 0 257
Andhra Pradesh
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
By Pagadala Venkateswar 2026-01-26 12:06:41 0 147
Andhra Pradesh
కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర...
By Ratna Sekhar 2026-02-19 20:24:23 0 797
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com