రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...

0
101

వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేడు ఆదివారం కోదాడలోని కోదండ రామాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి అమ్మవారి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాసరావు, తెలంగాణ మలిదిశ ఉద్యమ నేత రాయపూడి వెంకటనారాయణలు శనివారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుసుమ, ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి లను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పూజల అనంతరం నాగు బండి వీరయ్య, భద్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
మళ్ళీ ఎన్నికలు
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
By Krishna Balina 2025-12-18 00:33:50 0 248
Andhra Pradesh
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
By Kothuru Murali 2026-05-22 14:22:02 0 35
Andhra Pradesh
Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం.
2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:26:59 0 109
Telangana
జగిత్యాల : ఈరోజు KCR సాయంత్రం 4:45 pm
జగిత్యాల సభ నేపథ్యంలో నేడు సాయంత్రం 4:45 pm గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ జగిత్యాలకు...
By Sunka Santhosh 2026-04-20 10:28:22 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com