రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...

0
135

వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేడు ఆదివారం కోదాడలోని కోదండ రామాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి అమ్మవారి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాసరావు, తెలంగాణ మలిదిశ ఉద్యమ నేత రాయపూడి వెంకటనారాయణలు శనివారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుసుమ, ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి లను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పూజల అనంతరం నాగు బండి వీరయ్య, భద్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హెల్మెట్ లేకపోతే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయేవొద్దండి !!
కర్నూలు : ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయెద్దు ...కర్నూలు డిఎస్పీ శ్రీ జె....
By Hari Krishna 2025-12-26 16:37:49 0 221
Andhra Pradesh
మదనపల్లె: కృష్ణుడి ఆలయంలో భారీ చోరీ.
మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు....
By Pagadala Venkateswar 2026-02-24 08:01:37 0 167
Telangana
అభివృద్ధి పనులు త్వరగా పూర్తీ చేయాలి: మంచిర్యాల కలెక్టర్
ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అభివృద్ధి పనులు త్వరగా...
By Bonagiri RaviShankar 2026-07-05 04:13:59 0 107
Andhra Pradesh
NTR జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ ప్రెస్ మీట్
ప్రెస్ నోట్  27.12.2025   NTR జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకార్యాలయంలో పత్రికా...
By Rajini Kumari 2025-12-27 10:52:01 0 223
Andhra Pradesh
నాగ బోతు రమేష్ నాయుడు
*నాగోతు రమేష్ నాయుడు*   బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం...
By Rajini Kumari 2025-12-13 09:29:29 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com