ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి

0
259

ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి..

నందిగామ ఎన్టీఆర్ జిల్లా 

ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో ఇరువురు మృతి చెందిన దుర్ఘటన కంచికచర్ల చెరువు కట్ట దాటిన తర్వాత 65 నెంబర్ జాతీయ రహదారిపై మిశ్రా దాబా వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందింది. కంచికచర్ల మండలం కీసర గ్రామం నుండి ఎస్ కే బాబు అనే వ్యక్తి ఆటో సర్వీస్ చేసుకుంటూ కంచికచర్ల వచ్చాడు. కీసర తిరుగు ప్రయాణంలో ఆటోలో అరటి గెలలు వేసుకొని వెళ్తుండగా కంచికచర్ల గ్రామంలోని ప్రణీత కాలనీకి చెందిన పసుపులేటి కిట్టమ్మ నందిగామ వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా కంచికచర్ల శివారులో మిత్ర ఆక్సిన్ కంపెనీ దాటిన తర్వాత మిశ్రా దాబా వద్ద, నందిగామ వైపు వెళుతున్న ఇన్నోవా కారు ఆటోని వెనుక నుండి డీ కొనడంతో ఆటో పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎస్ కె బాబు(45) అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న పసుపులేటి కిట్టమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం మహిళను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అందించి, గాయాల తీవ్రత దృష్ట్యా మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ మేరకు కంచికచర్ల ఎస్ఐ పి. విశ్వనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో విశేష నిత్య పూజలు భారీగా పెరిగిన భక్తుల తాకిడి
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,19 డిసెంబర్ 2025*...
By Rajini Kumari 2025-12-19 10:44:05 0 230
Telangana
మంచిర్యాల్: అంగనివాడు వైపు.. అడుగు బంగారి భవిష్యత్తు.. బాట
అంగనివాడి వైపు చిన్నారులు వేసే అడుగు వారి బంగారి భవిష్యత్ కి బాటాని మంచిర్యాల్ జిల్లా ...
By Bonagiri RaviShankar 2026-05-31 09:19:35 0 159
Telangana
ఫార్మర్ రిజిస్టర్ పూర్తి చేసుకోండి AO తెలపడం జరిగింది....
నల్లబెల్లి: ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోండి: ఏవో భారత్ అవాజ్ న్యూస్: 17 జూన్ వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-06-17 06:26:40 0 148
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:41 0 93
Andhra Pradesh
పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం...
By Kothuru Murali 2026-01-20 13:35:21 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com