డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్

0
140

విజయవాడ 

 

*డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ ప్రసాద్ ప్రెస్ మీట్*

 

పోలీస్ శాఖకు 35 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన రాజీనామా చేశా 

 

ఆదివాసి తెగకు చెందిన స్వచ్ఛమైన హిందువుగా తన విధులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి.

 

రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయి 

 

శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం

 

మార్చి 1న తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని కోరినా సరైన స్పందన లేదు 

 

ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని ఎస్హెచ్ఓ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు 

 

కనీసం అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇవ్వలేదు 

 

గవర్నర్ నుండి కూడా అనుమతి లభించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించను

 

దేశంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలీ 

 

హిందూ దేవుళ్లకు, తమ జాతులకు ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పేలా కమిటీ వేయాలీ 

 

శ్రీ వారి లడ్డూ ప్రసాదం, ఆలయ పవిత్రతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు.

 

 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లపై ఫిర్యాదు.

 

టీవీ ఛానెళ్లలో, సోషల్ మీడియాలో శ్రీవారిపై అనుచితంగా మాట్లాడిన 100 మంది ప్రతినిధులపై కూడా ఫిర్యాదు.

 

గౌరవ కోర్టులో కేసు ఫైల్ చేసిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్.

 

35 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు చేసిన పోలీస్ ఆఫీసర్ గా ఒక హిందువుగా మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన.

 

మొదట తన ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు విముఖత చూపారూ 

 

గవర్నర్ ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం రాలేదు 

 

చివరకు న్యాయం కోసం గౌరవ కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడి.

 

బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 196, 197, 61, 299, 302, 352 కింద కేసు నమోదుకు విన్నపం

 

మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం, పవిత్రమైన ప్రసాదంపై కుట్రపూరిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరము

 

తిరుమల లడ్డూ కల్తీ, భక్తుల మనోభావాల దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు.

 

 IPC 304, BNS 105 సెక్షన్ల ప్రకారం నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి 

 

ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులు, SHOs, DSPs, SPs కలెక్టర్లపై కూడా విచారణ జరపాలీ 

 

అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ లింకుల గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం

 

 నిజమైతే దర్శకుడు, నటీనటులను అరెస్ట్ చేయాలని డిమాండ్.

 

ప్రచారాలపై లడ్డూ ప్రసాదంలో హార్పిక్, మాంసం, విషం కలిశాయంటూ ప్రచారం చేసిన మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి

 

లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ ఎక్కడ, ఎప్పుడు, ఏ పరిశ్రమలో జరిగిందో ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్.

 

గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో భక్తుల ప్రాణాలకు రక్షణ లేదని, విజయవాడ, పుష్కరాల ఘటనలే ఇందుకు నిదర్శనం 

 

 లడ్డూల తయారీకి వినియోగించిన నిధులు ఏ రూపంలో చెల్లించారు? బ్యాంక్ ద్వారానా లేదా నగదు రూపంలోనా? అన్న కోణంలో విచారణ జరపాలి.

 

లక్షలాది లడ్డూల తయారీలో వెలువడిన మృతకలేబరాలను, మాంసాన్ని ఎక్కడ పడేశారో సిట్ గుర్తించిందా?

 

 ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎన్ని టన్నుల మృతకలేబరాలను, ఎన్ని వేల హార్పిక్ డబ్బాలను సీజ్ చేసిందో చార్జ్ షీట్‌లో రాయాలి 

 

నెల్లూరు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత, ప్రభుత్వం 'హార్పిక్' వంటి రసాయనాల ప్రస్తావన తెస్తూ కొత్త వెర్షన్ మొదలుపెట్టింది 

 

నా ఫిర్యాదును స్వీకరించి, ఎస్సై స్థాయి నుండి ఐపిఎస్ స్థాయి వరకు ఎవరితోనైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలీ 

 

తన ఫిర్యాదు అవాస్తవమని తేలితే తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా అభ్యంతరం లేదు.

 

వరాహ అవతారాన్ని, లడ్డూ ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడటం వల్ల కోట్లాది మంది భక్తులతో పాటు తన వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్నాయి

Search
Categories
Read More
Andhra Pradesh
Naravaripalle Sankranti Celebrations: మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు.. ఇదిగో ఫొటోలు..
తిరుపతి జిల్లాలోని సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సందడిగా సాగుతోంది....
By Pagadala Venkateswar 2026-01-13 12:11:49 0 157
Andhra Pradesh
గుంటూరు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి లతా గారు అన్నారు.
  <>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్...
By KOTESWARARAO KVSR 2026-01-24 13:06:36 0 402
Andhra Pradesh
మరి కాసేపట్లో టీవీ కే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ
*కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ*   చెన్నైలో కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్...
By Rajini Kumari 2026-05-08 13:30:56 0 74
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఇంజనీరింగ్ పనులు పునః ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న...
By Rajini Kumari 2026-01-19 11:11:44 0 133
Telangana
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త
ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ...
By Boiena Rajesh 2026-03-01 09:10:24 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com