మహిళల అక్రమ రవాణాను అరికట్టండి

0
166

*మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి*

*- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ*

 

విజయవాడ స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాల్‌లో శుక్రవారం మహిళల రక్షణపై ట్రాఫికింగ్‌ను అరికట్టండి- రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా (ట్రాఫికింగ్) చేయడం ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని తెలిపారు. బాధితులతో, ముఖ్యంగా ట్రామాలో ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, కేసులను ఎలా విచారించాలి, వారి నుంచి కీలక సమాచారాన్ని ఎలా సేకరించాలి వంటి అంశాలపై సమగ్రంగా ఈ కార్యక్రమంలో అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారన్నారు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతోపాటు శక్తి (Shakti) యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.

 

నిందితులకు శిక్ష పడేలా చేయడంలో (Conviction Rate) విభాగాల మధ్య సమన్వయం పెంచుకోవడం అవసరమని, ఉద్యోగాల పేరుతో, ప్రేమ పేరుతో జరిగే మోసాలు మరియు బలవంతపు కార్మికుల అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని, ఈ సమావేశం ద్వారా అధికారులకు ఉన్నతమైన దర్యాప్తు పద్ధతులు నేర్పడమే కాకుండా రాష్ట్రంలో కేసుల తీవ్రతను తగ్గించడంపై దృష్టి పెట్టామని చైర్‌పర్సన్ పేర్కొన్నారు.

 

ఆర్పీఎఫ్ ఎస్పీ షణ్ముఘం మాట్లాడుతూ... మాజీ ఐపీఎస్ అధికారి పి.ఎం. నాయర్ శిక్షకుడిగా వ్యవహరించి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో రైల్వే డివిజనల్ మేనేజర్, ఆర్‌పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP), మహిళా అభివృద్ధి శాఖ (WCD), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Monsoon Rains Slow Mumbai Logistics and Supply Chains
Continuous heavy rainfall across Mumbai has disrupted logistics operations, slowing cargo...
By Navya Sree 2026-07-03 05:37:08 0 43
Andhra Pradesh
నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్...
By Shyamala Yadagiri 2026-03-21 04:07:54 0 300
Telangana
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
By Sadaq Sadaq 2026-04-24 12:09:06 0 150
Bharat Aawaz
"సాంకేతికత అంటే పాశ్చాత్య దేశాలకే పరిమితమని ఎవరు అన్నారో? మనదేశంలోనే 2000 ఏళ్ల క్రితమే ‘నీటితో నడిచే ఘడియారం’ ఉండేదని తెలుసా?"
"2000 ఏళ్ల క్రితమే నీటితో నడిచిన ఘడియారం – భారత విజ్ఞాన శక్తికి ఇది నిదర్శనం!" సూర్య...
By Bharat Aawaz 2025-08-03 18:32:08 0 799
Telangana
ప్రధాని మోదీ స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి
 ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి - ప్రధాని మోదీ ‎ఒక సంవత్సరం వరకు...
By Ponnala Srinivasrao 2026-05-11 07:13:52 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com