చీరాలలో ఉచిత మెగా కార్డియాక్ క్యాంప్, గుండె ఆరోగ్యంపై అవగాహన

0
176

చీరాల 

గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు ముందస్తు నిర్ధారణ కోసం చీరాలలో మెగా కార్డియాక్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కీ॥శే॥లు శ్రీజిత్ స్వరూప్ జ్ఞాపకార్థం బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడా కె.వై.కె. విజయ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.

ఈ మెగా కార్డియాక్ క్యాంప్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సిపాయిపేటలోని విశాల్ మార్ట్ సమీపంలో నిర్వహించనున్నారు. గుండె జబ్బుల ప్రమాదంలో ఉన్నవారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేకంగా 30 సంవత్సరాల పైబడినవారు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు, ధూమపానం లేదా మద్యపానం చేసే వారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, అలాగే ఛాతినొప్పి, అయాసం, గుండె దడ వంటి లక్షణాలు ఉన్నవారు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ శిబిరంలో భాగంగా సీబీసీ , ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (ఎఫ్ బి ఎస్ ), లిపిడ్ ప్రొఫైల్, కార్డియాక్ ఎంజైమ్ (సికె-ఎంబి ), ఈసీజీ (ఈసీజి ) వంటి పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. సుమారు రూ.2000 విలువ గల ఈ పరీక్షలను బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఉచితంగా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

“ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుంది” అనే నినాదంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శిబిరంలో పాల్గొనదలచిన వారు ముందస్తుగా 78423 76111, 78423 67111 నంబర్లకు సంప్రదించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.
పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట...
By Kothuru Murali 2026-01-22 11:42:57 0 139
Andhra Pradesh
పర్యాటకులకు ప్రత్యేక యాప్ ఆంధ్ర టాక్సీలో హాయి హాయిగా వివరిద్దాం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 25, 2025*...
By Rajini Kumari 2025-12-25 11:20:25 0 241
Telangana
'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు...
By Sidhu Maroju 2025-11-29 15:56:23 0 171
Andhra Pradesh
వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్ధరించాలి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
*వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి    సత్వరమే నూతన వె్జ్ బోర్డు ఏర్పాటు...
By Rajini Kumari 2026-03-28 14:26:00 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com