చీరాలలో ఉచిత మెగా కార్డియాక్ క్యాంప్, గుండె ఆరోగ్యంపై అవగాహన

0
237

చీరాల 

గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు ముందస్తు నిర్ధారణ కోసం చీరాలలో మెగా కార్డియాక్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కీ॥శే॥లు శ్రీజిత్ స్వరూప్ జ్ఞాపకార్థం బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడా కె.వై.కె. విజయ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.

ఈ మెగా కార్డియాక్ క్యాంప్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సిపాయిపేటలోని విశాల్ మార్ట్ సమీపంలో నిర్వహించనున్నారు. గుండె జబ్బుల ప్రమాదంలో ఉన్నవారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేకంగా 30 సంవత్సరాల పైబడినవారు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు, ధూమపానం లేదా మద్యపానం చేసే వారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, అలాగే ఛాతినొప్పి, అయాసం, గుండె దడ వంటి లక్షణాలు ఉన్నవారు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ శిబిరంలో భాగంగా సీబీసీ , ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (ఎఫ్ బి ఎస్ ), లిపిడ్ ప్రొఫైల్, కార్డియాక్ ఎంజైమ్ (సికె-ఎంబి ), ఈసీజీ (ఈసీజి ) వంటి పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. సుమారు రూ.2000 విలువ గల ఈ పరీక్షలను బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఉచితంగా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

“ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుంది” అనే నినాదంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శిబిరంలో పాల్గొనదలచిన వారు ముందస్తుగా 78423 76111, 78423 67111 నంబర్లకు సంప్రదించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన శంకుస్థాపన.
AP: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-01-24 10:08:18 0 168
Andhra Pradesh
క్రమశిక్షణ గల పార్టీ టిడిపి అని నిరూపితమైంది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
*క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నిరూపితమైంది* *హైబ్రీడ్‌ మహానాడును విజయవంతం చేసిన...
By Rajini Kumari 2026-05-30 12:06:07 0 114
Andhra Pradesh
పులిచర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దిరెడ్డి
బుధవారం పులిచర్ల మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి....
By Kothuru Murali 2026-04-29 11:24:33 0 95
Andhra Pradesh
బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రోంగళి జగన్నాథరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీనుని మర్యాదపూర్వక కలయక.
విజయనగరం 24 మార్చి 2026: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు బొబ్బిలి...
By Yalakala Vasunaidu 2026-03-24 08:50:34 0 322
Andhra Pradesh
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి...
By Kothuru Murali 2026-03-02 04:01:26 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com