"బాలుడు ఆసిఖ్ మిస్సింగ్ : వివరాలు వెల్లడించిన ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్!

0
224

సికింద్రాబాద్ : వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ వెల్లడించారు. 

వెస్ట్ మారేడుపల్లిలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సమీపంలో నివసించే మొహమ్మద్ అలీ ఖాన్ మనవడు ఆసిఖ్ (16) ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన లగేజీతో సహా బయటకు వెళ్ళిపోయాడు.

తల్లిదండ్రులు మరణించడంతో ఆసిక్ తన తాత మొహమ్మద్ అలీ ఖాన్ సంరక్షణలో ఉంటున్నాడు. 

22వ తేదీ తెల్లవారుజామున బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి తాత ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 106/2026 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ తెలిపారు. 

ప్రస్తుతం ఏఎస్ఐ లింగయ్య ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అదృశ్యమైన బాలుడు 5.5 అడుగుల ఎత్తు ఉండి, నలుపు రంగు టీ-షర్ట్ మరియు ట్రౌజర్ ధరించి ఉన్నాడు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగల ఈ బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా 9885700365 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్.హెచ్.ఓ. విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్ లో విదేశీ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసారు
మంచిర్యాలలోని తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో సమావేశమై...
By Avunoori Mahesh 2026-04-15 11:02:33 0 212
Andhra Pradesh
గౌరవ ఏపీ ఈగల్ చీఫ్ ఐజిపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు గారు మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమం చేపట్టారు.
 తేది*: 30-12-2025 📍*స్థలం*: అరండలపేట పిఎస్ లిమిట్స్, గుంటూరు *గౌరవ ఏపీ ఈగల్ చీఫ్, ఐజిపి...
By KOTESWARARAO KVSR 2025-12-30 13:04:17 0 548
Goa
Goa Bans Tobacco Sales Near Educational Institutions
The Goa State Commission for Protection of Child Rights (GSCPCR) has issued a strict enforcement...
By Tejaswini Komanduru 2026-06-04 09:27:13 0 90
Andhra Pradesh
తృటిలో తప్పిన ప్రమాదం.
మదనపల్లెలో సబ్ కలెక్టరేట్, ఉడా కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఒక చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ, ఆ...
By Pagadala Venkateswar 2026-03-12 14:27:21 0 183
Telangana
లక్సట్టిపేట్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : లక్షెట్టిపేట్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు....
By Avunoori Mahesh 2026-06-22 11:57:01 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com