"బాలుడు ఆసిఖ్ మిస్సింగ్ : వివరాలు వెల్లడించిన ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్!

0
157

సికింద్రాబాద్ : వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ వెల్లడించారు. 

వెస్ట్ మారేడుపల్లిలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సమీపంలో నివసించే మొహమ్మద్ అలీ ఖాన్ మనవడు ఆసిఖ్ (16) ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన లగేజీతో సహా బయటకు వెళ్ళిపోయాడు.

తల్లిదండ్రులు మరణించడంతో ఆసిక్ తన తాత మొహమ్మద్ అలీ ఖాన్ సంరక్షణలో ఉంటున్నాడు. 

22వ తేదీ తెల్లవారుజామున బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి తాత ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 106/2026 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ తెలిపారు. 

ప్రస్తుతం ఏఎస్ఐ లింగయ్య ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అదృశ్యమైన బాలుడు 5.5 అడుగుల ఎత్తు ఉండి, నలుపు రంగు టీ-షర్ట్ మరియు ట్రౌజర్ ధరించి ఉన్నాడు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగల ఈ బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా 9885700365 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్.హెచ్.ఓ. విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
మనుషులను అతిగా నమ్మడమే పూరి గారి బలహీనత
సంగీత దర్శకుడు రఘు కుంచె మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి మధ్య ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం...
By Ponnala Srinivasrao 2026-04-04 12:27:46 0 211
Telangana
ఆషాడ మాస బోనాల సందర్భంగా 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ పూజలు.
మల్కాజిగిరి జిల్లా /ఆల్వాల్ ఆశాడ మాస  బోనాల పండుగ సందర్బంగా వెంకటాపురం డివిజన్‌లోని...
By Sidhu Maroju 2025-07-20 15:35:19 0 1K
Andhra Pradesh
కొడుకు కోసం తండ్రి విన తులు
కుమారుని ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు వివరాలకు వెళ్ళే ముందు విశాఖపట్నం...
By Mobbu Venkatramana 2026-01-30 18:29:25 0 426
Andhra Pradesh
“ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిజంగా ప్రభావితం చేస్తున్నది ఎవరు?”
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రస్తుతం ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. కొన్ని రాజకీయ పరిణామాలు,...
By Babitha Babitha 2026-05-15 10:27:00 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com