"బాలుడు ఆసిఖ్ మిస్సింగ్ : వివరాలు వెల్లడించిన ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్!

0
228

సికింద్రాబాద్ : వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ వెల్లడించారు. 

వెస్ట్ మారేడుపల్లిలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సమీపంలో నివసించే మొహమ్మద్ అలీ ఖాన్ మనవడు ఆసిఖ్ (16) ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన లగేజీతో సహా బయటకు వెళ్ళిపోయాడు.

తల్లిదండ్రులు మరణించడంతో ఆసిక్ తన తాత మొహమ్మద్ అలీ ఖాన్ సంరక్షణలో ఉంటున్నాడు. 

22వ తేదీ తెల్లవారుజామున బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి తాత ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 106/2026 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ తెలిపారు. 

ప్రస్తుతం ఏఎస్ఐ లింగయ్య ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అదృశ్యమైన బాలుడు 5.5 అడుగుల ఎత్తు ఉండి, నలుపు రంగు టీ-షర్ట్ మరియు ట్రౌజర్ ధరించి ఉన్నాడు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగల ఈ బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా 9885700365 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్.హెచ్.ఓ. విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
By Pagadala Venkateswar 2026-01-18 10:36:58 0 198
Andhra Pradesh
మంచినీటి పనులను అడ్డుకున్న వెల్లంపల్లి మైలవరం రత్నకుమారి ఆగ్రహం
*విద్యాధరపురం మంచినీటి రిజర్వాయర్ మరమ్మత్తు పనులను అడ్డుకున్న వెలంపల్లి*   *44వ డివిజన్...
By Rajini Kumari 2026-01-28 12:49:41 0 175
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:43 0 543
Andhra Pradesh
మదనపల్లి : కోడలపై అత్తామామల దాడి.
మదనపల్లెలో బుధవారం నాడు జరిగిన ఘటనలో, నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు...
By Pagadala Venkateswar 2026-04-23 03:31:39 0 107
SURAKSHA
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు చేపట్టిన కమ్యూనిటీ కిచెన్ సేవా కార్యక్రమ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు ప్రతిరోజూ 1,000 మంది నిరుపేదలకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు....
By Kalaga Sailaja 2026-07-01 05:55:00 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com