తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు.

0
61

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు

సర్వదర్శనానికి 8 గంటల సమయం, 5 కంపార్ట్‌మెంట్లలో నిరీక్షణ

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. నిన్న మొత్తం 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

 

బుధవారం నాడు 25,550 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ద్వారా ఒక్కరోజే రూ.4.43 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

 

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వివరించారు.

Search
Categories
Read More
Telangana
"Growing Concerns Over Declining Credibility in Digital Journalism.|
Hyderabad: Concerns are increasingly being raised over the declining standards of journalism and...
By Sidhu Maroju 2026-05-14 12:51:33 0 135
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
By Gadiyapudi Narendra 2026-01-10 12:03:32 0 491
Bihar
Adani Power Deal Bihar’s Gain or Monopoly Pain
Adani Power Ltd has inked a 25-year deal with #BSPGCL to supply 2,400 MW electricity to Bihar....
By Pooja Patil 2025-09-15 04:39:51 0 906
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు...
By Pagadala Venkateswar 2026-04-02 06:17:42 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com