అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్... ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.

0
105

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ భారీ సోలార్ ప్లాంట్

రూ. 5,400 కోట్ల పెట్టుబడితో ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రం

ఏప్రిల్ 23న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి పైగా ఉపాధి అవకాశాలు

ఏపీలో మొత్తం రూ. 82,000 కోట్ల పెట్టుబడుల దిశగా రీన్యూ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సుమారు రూ. 5,400 కోట్ల వ్యయంతో సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) ముందుకొచ్చింది. ఈ మెగా ప్రాజెక్టుకు ఏప్రిల్ 23న ముఖ్యమంత్రి చంద్రబాబు, రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 4,200 కోట్లతో 6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ ప్లాంట్‌ను, మరో రూ. 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను రీన్యూ నిర్మించనుంది. కేవలం 24 నెలల రికార్డు సమయంలోనే ఈ ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,100 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

 

సోలార్ పీవీ మాడ్యూల్స్, సెల్స్ తయారీకి అత్యంత కీలకమైన ఇంగోట్స్, వేఫర్లను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా సోలార్ సరఫరా రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ ప్లాంట్ దోహదపడనుంది. 2015 నుంచి రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న రీన్యూ, ఇప్పటికే అనంతపురం జిల్లాలో రూ. 22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌ను నిర్మిస్తోంది. తాజా ప్రాజెక్టుతో కలిపి రాష్ట్రంలో మొత్తం రూ. 82,000 కోట్ల పెట్టుబడుల దిశగా రీన్యూ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుతో అనకాపల్లి పారిశ్రామిక ముఖచిత్రం మారనుందని నిపుణులు భావిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్.
కురబలకోట మండలానికి చెందిన ఇద్దరు గంజాయి బానిసలకు మార్పు తీసుకురావాలని మదనపల్లె డీఎస్పీ పావని...
By Pagadala Venkateswar 2026-05-01 04:00:39 0 100
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా సింగరేణి జిఎం కార్యాలయంలో కార్మికులకు వ్యాసరచన పోటీలు
ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా...
By Avunoori Mahesh 2026-04-09 04:38:47 0 228
Andhra Pradesh
చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు.
అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో...
By Pagadala Venkateswar 2026-05-20 03:41:18 0 98
Andhra Pradesh
నిమ్మనపల్లెలో ఒకేరోజు ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో 16 ఏళ్ల ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపింది. వారి...
By Pagadala Venkateswar 2026-06-27 05:39:20 0 45
Andhra Pradesh
100 రోజుల ప్రణాళిక,!! సెట్కూర్ CEO
కర్నూలు : వంద రోజుల ప్రణాళిక అమలు కావాలి: సెట్కూరు సీఈఓ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఏపీ క్యాంప్...
By Hari Krishna 2025-12-21 14:02:53 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com