విద్యా అనేది శక్తివంతమైన ఆయుధం: ఎంఎల్ఏ మిరియాల శిరీషదేవి

0
200

ఇంటర్మీడియట్, పదవ తరగతి CBSC ఫలితాల్లో రంపచోడవరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్ధులను సన్మానించి ఉన్నత చదువులకు తోడ్పాటు అందిస్తాను అని విద్యార్థులకు హామీ.రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రపంచంలో అత్యంత విలువైనా ఆయుధం విద్యమాత్రమే అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరిషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ ఆమె క్యాంపు కార్యాలయంలో సోమవారం ఇటీవల విడుదల అయిన ఇంటర్మీడియట్, CBSC పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వై. రామవరం గురుకుల కళాశాలలో చదివి రాష్ట్ర గురుకుల కళాశాలల్లోనే మొదటి స్థానం సాధించిన దూరిపల్లి శర్వాణి శ్రీ సునంద MPC గ్రూప్ లో 986/1000 సాధించారు, ఈమెకు రూ;15000/- లు నగదు అందజేశారు. అలాగే ఒకేషనల్ గ్రూప్ లో 985/1000 మార్కులు సాధించిన బి.వెంకట సాయి మంజులకు రూ;10,000/- లు నగదు అందజేశారు . బై పి సి గ్రూపు లో 976/1000 మార్కులు సాధించిన తామ వెంకటేష్ కు రూ;5000/- లు నగదు అందజేశారు. బై పి సి గ్రూపు లో 975/1000 మార్కులు సాధించిన ఎన్.అఖిల, MPC లో 971/1000 మార్కులు సాధించిన పల్లాల రవీంద్ర రెడ్డి, MPC లో 966/1000 మార్కులు సాధించిన బి. సత్యశ్రీ లను అభినందించారు. మరియు ఏకలవ్య పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో CBSC ఫలితాల్లో ఎమ్.జయ రామకృష్ణ 478/500 మార్కులు సాధించిన ఆయనకు రూ; 5000/- లు మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన బి.నవతేజ మరియు తృతీయ స్థానంలో నిలిచిన వెంకట లక్ష్మి లకు రూ;5000/- లు చొప్పున ప్రోత్సాహం నగదుగా అందజేశారు. అనంతరం విద్యార్థులకు ఆమె స్వయంగా వండిన ఆహార పదార్థాలను వడ్డించి స్వీట్ ప్యాక్ లను అందించి ఘనంగా సన్మానించారు* వీరు ప్రభుత్వ కళాశాల, పాఠశాలలో చదివి ఇలాంటి మార్కులు సాధించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. వారికి ఇంతటి మంచి తర్ఫీదు ఇచ్చి విద్యాబోధన చేసిన అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. వారికి ఆమె బోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళతో కలిసి బోజనాలు చేశారు. ఈ సందర్భంగా మట్టిలో మాణిక్యాలైన వారికి ఉన్నత చదువులకు తన వంతుగా ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా తనతో చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లిదండ్రులు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీలాంటి వారి సహాయ సహకారాలు అవసరం అని ఇలా మమ్మల్ని ఇంటికి పిలిచి మీతో పాటు భోజనాలు చేయటం మర్చిపోలేమని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో APIIC డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, తెదేపా సీనియర్ నాయకులు గణజాల తాతారావ్ తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో...
By Sriramula Anil 2026-06-21 14:28:37 0 247
Andhra Pradesh
ఆపరేటర్ ఉద్యోగాలు!!
కర్నూలు : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), నాసిక్.. తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేటర్...
By Hari Krishna 2025-12-22 08:45:17 0 215
Andhra Pradesh
ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం
 ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది....
By John Baji 2025-12-29 09:19:48 0 158
SURAKSHA
రోడ్డు ద్రతభ - ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
మాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరాను అరికట్టడానికి పోలీసులు 'ఆపరేషన్...
By Kalaga Sailaja 2026-06-29 08:05:33 0 67
Andhra Pradesh
యునైటెడ్ ఇన్సూరెన్స్ ఇండియా లో ఉద్యోగాలు!!
కర్నూలు : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ - చెన్నై యూనిట్ వివిధ విభాగాల్లో 153 గ్రాడ్యుయేట్...
By Hari Krishna 2025-12-22 08:28:43 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com