కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్

0
73

హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. 

‎పులి తిన్న ఆవుల గురించి బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. 

‎పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తేనే జీవన్ రెడ్డికి ఆయన కథేమిటనేది అర్థమవుతుందన్నారు. 

‎జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినప్పుడు కనిపించ లేదా? అని ఆయన్ని సూటిగా ప్రశ్నించారు. 

‎‎సీఎం రేవంత్ రెడ్డి సభకు పోటీగా కేసీఆర్ సభ పెట్టారని ఆరోపించారు. 

‎రేవంత్ సభ 20 రోజుల ముందే ఫిక్స్ అయిందని గుర్తు చేశారు.

‎కేసీఆర్‌కి మాది కౌంటర్ ప్రోగ్రాం కాదని కుండబద్దలు కొట్టారు. 

‎ఆశల పల్లకిలో ఊరేగించడం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి అలవాటేనంటూ వ్యంగ్యంగా అన్నారు. 

‎జీవన్ రెడ్డికి కేసీఆర్ ఏం ఆశలు చూపించారో అంటూ ఎద్దేవా చేశారు.

‎మేడిగడ్డలో కేసీఆర్ చేసిన మోసాలపై జీవన్ రెడ్డే తమకు పాఠాలు చెప్పారని ఈ సందర్భంగా టీ పీసీసీ చీఫ్ గుర్తు చేసుకున్నారు. 

‎అలాంటి జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కోరస్ ఇస్తున్నాడని విమర్శించారు. 

‎గతంలో కేకే, డీఎస్ లాగే జీవన్ రెడ్డి కూడా బాధపడుతారని చెప్పారు. 

‎రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని స్పష్టం చేశారు. 

‎రేవంత్ పోవాలి మార్పు రావాలి అనే హక్కు ఎక్కడిది? 

‎జీవన్ రెడ్డికి అంటూ ఆయనపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు లాలాపేట మరియు కొత్తపేట పోలీస్ స్టేషన్లలో మాదకద్రవ్యాలు పట్టివేత.
Kvsr. Koteswararao. Guntur   *గుంటూరు జిల్లా పోలీస్...* *కొత్తపేట పోలీస్ స్టేషన్* *ది:...
By KOTESWARARAO KVSR 2026-01-09 16:13:14 0 435
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 139
Andhra Pradesh
స్థానిక కలెక్టర్ ప్రజా సమస్యల వేదిక
సోమవారం(22/12/2025) స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Rajini Kumari 2025-12-22 07:50:52 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com