పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం

0
183

*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*

 

*పోలవరం, జనవరి 20:* 

 

పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. రెండో రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ డాం గ్యాప్ 2 ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు .అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమై తోలి రోజు ఫీల్డ్ లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని ఉన్నారు.

Search
Categories
Read More
Himachal Pradesh
Climate Watch: Shimla Records Warmer-than-Average May
The ongoing heatwave across North India hasn't spared the hills. Today, Shimla is seeing daytime...
By Dunna Jessicaruth 2026-05-15 04:41:25 0 74
Andhra Pradesh
పార్లమెంట్లో అమరావతి బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం*   •...
By Rajini Kumari 2026-04-02 16:27:29 0 193
Telangana
శ్రీరామ నవమి మహోత్సవం
శ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా...
By Dodla Nagaraju 2026-03-27 08:32:23 0 391
Business & Finance
GST Registration Makes Business Simple
GST registration is an essential step for businesses that want to operate legally, claim input...
By Navya Sree 2026-07-17 06:16:07 0 37
Telangana
ఎన్​ కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి
రూ.కోటి రివార్డు ఉన్న టాప్ లీడర్ గణేశ్ హతం   ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు...
By Ellandula Sandeep 2025-12-25 09:20:22 0 599
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com