"ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని సీన్.. స్వీట్ షాపులో వసూళ్లకు ప్లాన్.. అల్వాల్‌లో కిలాడీ లేడీల అరెస్ట్!"

0
138

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై దాడులకు దిగారు.. కట్ చేస్తే, అసలు విషయం బయటపడి ఇప్పుడు పోలీసుల కటకటాలపాలయ్యారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని నమ్మిస్తూ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు నకిలీ మహిళా అధికారులను మంగళవారం అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

ఓల్డ్ అల్వాల్ ఐజీ ప్రాంతంలోని ఒక స్వీట్ షాపులోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు, తాము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని పరిచయం చేసుకున్నారు. 

దుకాణంలో తనిఖీలు చేస్తున్నట్లు నటిస్తూ, యజమానిని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. 

అయితే, వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్వీట్ హౌస్ యజమాని చాకచక్యంగా వ్యవహరించారు. వెంటనే స్థానిక అసలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కు సమాచారం అందించారు.

చేరుకున్న అసలైన అధికారి, ఆ మహిళలను నిలదీశారు. ఐడెంటిటీ కార్డులు చూపాలని కోరగా.. "మేము ప్రైవేట్ ఫుడ్ ఆఫీసర్లం, మాది ప్రైవేట్ సంస్థ" అంటూ పొంతన లేని సమాధానాలు చెబుతూ బుకాయించే ప్రయత్నం చేశారు.

దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు ఆ ఇద్దరు కిలాడీ మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఎవరైనా తనిఖీల పేరుతో వస్తే వారి ఐడెంటిటీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ అధికారుల ఆటలు సాగనివ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: కుప్పకూరిన టమాటా ధరలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం...
By Pagadala Venkateswar 2026-03-01 09:54:40 0 114
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు మండలం బారాడపల్లికి చెందిన చైతన్య(27),...
By Pagadala Venkateswar 2026-05-20 13:48:01 0 32
Andhra Pradesh
చింతూరులో వీధి కుక్కల బీభత్సం.
చింతూరు పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూగజీవాలకు...
By Shyamala Yadagiri 2026-05-10 11:37:21 0 92
Telangana
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా  రాజీవ్ గాంధీ సర్కిల్...
By Sidhu Maroju 2025-08-20 13:53:09 0 535
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com