మంచిర్యాల ఎంపీ కార్యాలయం లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

0
97

మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డీసీపీ మరియు జిల్లా ఉపాధి అధికారితో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు.

సుమారు 200 మందికి పైగా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎంపీ గారు శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.

అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాలపై కూడా ఎంపీ గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో నేరుగా మాట్లాడి పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. నిజమైన అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే లోన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

జిల్లా ఉపాధి అధికారికి యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నమోదు చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు న్యాయం చేయడం, సంక్షేమ పథకాలు సరైన వారికి చేరేలా చూడడం తన ముఖ్య లక్ష్యమని ఎంపీ గారు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు తదితరులు హాజరయ్యారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది....
By Sadaq Sadaq 2026-05-16 01:39:13 0 52
Andhra Pradesh
లూటీ కింగ్,ఆంధ్ర రాజాసింగ్ ను అరెస్టు చేయాలి
చీరాల : దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరియు రిటైర్డ్ న్యాయమూర్తులను అవమానిస్తున్న డిప్యూటీ...
By Vadlamudi NagaVenkat 2026-04-25 12:36:04 0 181
Andhra Pradesh
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి తో చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ:*   *ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-02-10 10:24:43 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com