తమిళనాడులో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం

0
116

తమిళనాడు/కృష్ణగిరి/తళి

 

*తమిళనాడులో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం.*

 

*ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లేయాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి*

 

*కృష్ణగిరి జిల్లా తళి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్ ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు*

 

*తళి నుంచి తిరుపతికి బస్ వేయాలని కోరిన స్థానిక ఎన్డీఏ నేతలు... అంగీకరించిన సీఎం చంద్రబాబు*

 

*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...*

 

• ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న ఆదరణ, అభిమానం తమిళనాడులోనూ చూపిస్తున్నారు.

• తమిళనాడుకు వచ్చినా నాకు సొంత గడ్డపై ఉన్నట్టే ఉంది.

• తమిళ సంస్కృతిపై ఎన్నో దాడులు జరిగినా ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకున్న ప్రాంతం ఇది.

• ఎంతో మంది ప్రముఖులు, ఆధ్యాత్మిక ప్రాంతాలు కలిగిన తమిళనాడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది.

• ఏపీలోని తిరుపతికి తమిళ భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. మన భాష ఏదైనా అంతా ద్రవిడులమే.

• ఎన్టీఆర్ సినీ జీవితం కూడా తమిళనాడు నుంచే ప్రారంభమైంది.

• తమిళనాడు- ఏపీ సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు నుంచే నేను వచ్చాను.

• చెన్నైకి తెలుగు గంగ నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. 

• తమిళనాడు- ఏపీ అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి చెందుతున్నాం.

• ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి సమర్ధ నాయకత్వం ఇస్తున్నారు. 

• ప్రధాని మోదీ సంక్షేమం- అభివృద్ధి- సుపరిపాలనతో దేశ భవిష్యత్తును పరుగులు పెట్టిస్తున్నారు.

• భారత్ ను ప్రపంచ పటంలో గౌరవమైన స్థానంలో ఉంచిన వ్యక్తి ప్రధాని మోదీనే.

• తమిళుల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి.

• వికసిత్ భారత్ కోసం ప్రధాని విజన్ తయారు చేశారు.

• మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లు తెచ్చారు.

• సమాజంలో మహిళలకు సమాన గౌరవం ఇచ్చేందుకు ఈ బిల్లు తెస్తే కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఆ బిల్లును వ్యతిరేకించాయి.

• ఢిల్లీని ఓడించామని డీఎంకే విర్రవీగుతోంది... మహిళా బిల్లును అడ్డుకున్న డీఎంకే పార్టీ ఏ సాధించింది..?

• పెరిగిన సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్, డీఎంకేలకు వచ్చిన ఇబ్బందేమిటి..?

• గతంలోనూ కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సహకరించలేదు.

• క్రెడిట్ అవసరం లేదని... ప్రతిపక్షాలకే క్రెడిట్ ఇస్తున్నామని ప్రధాని నేరుగా చెప్పినా కాంగ్రెస్, డీఎంకేలు బిల్లును ఓడించాయి.

• నియోజకవర్గాలు 50 శాతం పెరుగుతాయని స్పష్టంగా పేర్కొన్నా ఎందుకు వ్యతిరేకించారో డీఎంకే సమాధానం చెప్పాలి.

• తమిళనాడుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ గెలవాలి.

• ఏపీలో గత పాలకులు విధ్వంసం చేస్తే 22 నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం.

• గోదావరి నుంచి కావేరి వరకూ నీళ్లు తీసుకువెళ్లేలా నదులు అనుసంధానం చేస్తాం.

• ఇది జరగాలంటే కేంద్రంలో ప్రధాని మోదీ ఉండాలి. త్వరలో గంగా-కావేరీ కలవాలి.

• దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు. ఈ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వను.

• తమిళనాడు అన్ని అంశాల్లోనూ వెనుకబడే ఉంది. దీనికి కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసు.

• బసవ జయంతి లాంటి పవిత్రమైన రోజు ఈ ప్రాంతానికి రావటం నా అదృష్టం.

• తమిళనాడులో అప్పుల భారం పెరిగింది. శాంతిభద్రతలు పడిపోయాయి, డ్రగ్స్, మహిళలపై దాడులు, కస్టోడియల్ మరణాలు పెరిగాయి.

• మద్యంపై రేట్లు పెంచుకుని డీఎంకే ఆదాయం పెంచుకుంటోంది.

• అభివృద్ధి, ఉద్యోగాలు కావాలంటే కేంద్ర సహకారం అవసరం. జయలలిత స్పూర్తితో అభివృద్ధి జరగాలి.

• ఎన్డీఏకు వేసే ఓటుతో తమిళనాడు రాష్ట్రం గెలుస్తుంది. ప్రతీ ఇల్లూ, ప్రతీ వ్యక్తీ గెలుస్తారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో ద్వారపాలకుడి విగ్రహం ధ్వంసం.
మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉన్న రామాలయం మహాద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహం...
By Pagadala Venkateswar 2026-06-19 04:38:06 0 78
Andhra Pradesh
బొబ్బిలిలో పంట పొలాలను సందర్శించిన విద్యార్థులు
బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సోమవారం పంట పొలాలను సందర్శించారు. పంటలు...
By Boiena Rajesh 2026-03-23 11:16:03 0 202
SURAKSHA
Deepak Rawat, IAS: Bold Leadership in Governance
A distinguished 2007-batch Uttarakhand IAS officer whose transparent governance, decisive...
By Lokeshwari Panthadi 2026-07-18 05:51:43 0 51
Andhra Pradesh
గుంటూరు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి లతా గారు అన్నారు.
  <>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్...
By KOTESWARARAO KVSR 2026-01-24 13:06:36 0 595
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎస్పీ !
కర్నూలు :సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఐపియస్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన ...జిల్లా...
By Hari Krishna 2025-12-30 16:31:00 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com