"ఆ పదవి అంటేనే ‘భయం’.. సెలవుల బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారులు!"

0
250

హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు ఒక పరీక్షగా మారింది. ఆ పదవిలో బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు విముఖత చూపుతుండటంతో గురుకులాల పాలన కుంటుపడుతోంది. 

గత ఏడాది కాలంగా సాగుతున్న బదిలీలు, సెలవుల పరంపర చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

గురుకులాల్లో కేంద్రీకృత టెండర్ల నిర్వహణ, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU) బాధ్యతలు చూసుకోవాల్సిన కీలకమైన కార్యదర్శి పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి విజయేందిర బోయి, పదవి చేపట్టిన వారం తిరగకముందే సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది.

 ఆమె స్థానంలో అదనపు బాధ్యతలు తీసుకున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కూడా వెంటనే సెలవు పెట్టడంతో, గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మికి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆమె గడువు కూడా ఈ నెల 15తో ముగియడంతో ప్రస్తుతం సొసైటీకి పూర్తిస్థాయి నాథుడే కరువయ్యారు.

1986 నుంచి ఇప్పటివరకు సుమారు 58 మంది అధికారులు ఈ పోస్టులో పని చేయగా, కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 30 మంది అధికారులు మారుతూ రావడం గమనార్హం. ఒక అధికారి 4 రోజులు, మరొకరు 10 రోజులు, ఇంకొకరు 14 రోజులు మాత్రమే పని చేసి వెళ్లిపోవడం ఈ పదవి పట్ల అధికారుల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తోంది.

వందల కోట్ల రూపాయల విలువైన టెండర్లు, కేంద్రీకృత కొనుగోళ్లు, రాజకీయ ఒత్తిళ్లు లేదా పాలనాపరమైన చిక్కులే ఇందుకు కారణమని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

కీలకమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉండటంతో పాటు, విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో కార్యదర్శి లేకపోవడం గురుకుల విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పోస్టులో ఒక సమర్థవంతమైన అధికారిని శాశ్వత ప్రాతిపదికన నియమించి, వ్యవస్థను గాడిలో పెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Tripura
Fully Electric Rails: Tripura’s Green Transition
Tripura has entered a major transport era by achieving 100% electrification across its...
By Dunna Jessicaruth 2026-05-18 10:32:17 0 81
Telangana
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత, (మన నగర అభివృద్ధి కోసం పాలనా యంత్రాంగం మీ ముందుకు)...
By Pinnehasan Odela 2026-03-06 06:32:19 0 316
Andhra Pradesh
మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ
మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ...
By Pagadala Venkateswar 2026-05-25 04:30:06 0 91
Andhra Pradesh
కర్నూలు లో మాంసం దుకాణాల తనిఖీలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఈరోజు కర్నూల్లో పలు...
By Hari Krishna 2025-12-14 09:16:43 0 327
SURAKSHA
Shri Sanjay Gupta, IAS: Driving Himachal's Progress
A distinguished 1988-batch Himachal Pradesh cadre IAS officer whose visionary leadership,...
By Lokeshwari Panthadi 2026-07-20 05:55:32 0 36
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com