"ఆ పదవి అంటేనే ‘భయం’.. సెలవుల బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారులు!"

0
152

హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు ఒక పరీక్షగా మారింది. ఆ పదవిలో బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు విముఖత చూపుతుండటంతో గురుకులాల పాలన కుంటుపడుతోంది. 

గత ఏడాది కాలంగా సాగుతున్న బదిలీలు, సెలవుల పరంపర చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

గురుకులాల్లో కేంద్రీకృత టెండర్ల నిర్వహణ, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU) బాధ్యతలు చూసుకోవాల్సిన కీలకమైన కార్యదర్శి పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి విజయేందిర బోయి, పదవి చేపట్టిన వారం తిరగకముందే సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది.

 ఆమె స్థానంలో అదనపు బాధ్యతలు తీసుకున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కూడా వెంటనే సెలవు పెట్టడంతో, గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మికి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆమె గడువు కూడా ఈ నెల 15తో ముగియడంతో ప్రస్తుతం సొసైటీకి పూర్తిస్థాయి నాథుడే కరువయ్యారు.

1986 నుంచి ఇప్పటివరకు సుమారు 58 మంది అధికారులు ఈ పోస్టులో పని చేయగా, కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 30 మంది అధికారులు మారుతూ రావడం గమనార్హం. ఒక అధికారి 4 రోజులు, మరొకరు 10 రోజులు, ఇంకొకరు 14 రోజులు మాత్రమే పని చేసి వెళ్లిపోవడం ఈ పదవి పట్ల అధికారుల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తోంది.

వందల కోట్ల రూపాయల విలువైన టెండర్లు, కేంద్రీకృత కొనుగోళ్లు, రాజకీయ ఒత్తిళ్లు లేదా పాలనాపరమైన చిక్కులే ఇందుకు కారణమని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

కీలకమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉండటంతో పాటు, విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో కార్యదర్శి లేకపోవడం గురుకుల విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పోస్టులో ఒక సమర్థవంతమైన అధికారిని శాశ్వత ప్రాతిపదికన నియమించి, వ్యవస్థను గాడిలో పెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: రంజాన్ వేడుకలు
నిజామాబాద్ జిల్లా లో రంజాన్ పండగా అథ్యంత భక్తిశ్రధాలమద్యా ఘనంగా జారింది.ముస్లిం సోదరులు...
By Sadaq Sadaq 2026-03-21 05:08:43 0 147
Telangana
మహబూబాబాద్ జిల్లా
*మహబూబాబాద్ జిల్లా:-* *తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి...
By Ellandula Sandeep 2026-03-03 14:37:29 0 248
Andhra Pradesh
నందిగామలో వైసిపి బూత్ కన్వీనర్లకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ దిశా నిర్దేశం
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో...
By Patan Khuddus 2026-05-17 16:49:30 0 59
Andhra Pradesh
కర్నూలు: నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు
ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా...
By mahaboob basha 2025-05-29 15:25:22 0 2K
Andhra Pradesh
డాలర్ @90.93 పైస ఆల్ టైం రికార్డ్ పతనమైన రూపాయి
*డాలర్ @ రూ.90.83*   ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరిన రూపాయి విలువ   *రికార్డ్‌...
By Rajini Kumari 2025-12-16 11:38:37 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com