"ఆ పదవి అంటేనే ‘భయం’.. సెలవుల బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారులు!"

0
252

హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు ఒక పరీక్షగా మారింది. ఆ పదవిలో బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు విముఖత చూపుతుండటంతో గురుకులాల పాలన కుంటుపడుతోంది. 

గత ఏడాది కాలంగా సాగుతున్న బదిలీలు, సెలవుల పరంపర చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

గురుకులాల్లో కేంద్రీకృత టెండర్ల నిర్వహణ, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU) బాధ్యతలు చూసుకోవాల్సిన కీలకమైన కార్యదర్శి పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి విజయేందిర బోయి, పదవి చేపట్టిన వారం తిరగకముందే సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది.

 ఆమె స్థానంలో అదనపు బాధ్యతలు తీసుకున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కూడా వెంటనే సెలవు పెట్టడంతో, గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మికి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆమె గడువు కూడా ఈ నెల 15తో ముగియడంతో ప్రస్తుతం సొసైటీకి పూర్తిస్థాయి నాథుడే కరువయ్యారు.

1986 నుంచి ఇప్పటివరకు సుమారు 58 మంది అధికారులు ఈ పోస్టులో పని చేయగా, కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 30 మంది అధికారులు మారుతూ రావడం గమనార్హం. ఒక అధికారి 4 రోజులు, మరొకరు 10 రోజులు, ఇంకొకరు 14 రోజులు మాత్రమే పని చేసి వెళ్లిపోవడం ఈ పదవి పట్ల అధికారుల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తోంది.

వందల కోట్ల రూపాయల విలువైన టెండర్లు, కేంద్రీకృత కొనుగోళ్లు, రాజకీయ ఒత్తిళ్లు లేదా పాలనాపరమైన చిక్కులే ఇందుకు కారణమని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

కీలకమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉండటంతో పాటు, విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో కార్యదర్శి లేకపోవడం గురుకుల విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పోస్టులో ఒక సమర్థవంతమైన అధికారిని శాశ్వత ప్రాతిపదికన నియమించి, వ్యవస్థను గాడిలో పెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వెల్లడించిన అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ.
మదనపల్లె: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్...
By Pagadala Venkateswar 2026-07-24 05:20:07 0 19
Telangana
నర్స్ వృత్తి అమ్మ చేసే సేవ లాంటిదే- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫేర్ వెల్...
By Sidhu Maroju 2025-12-19 16:26:04 0 233
Punjab
Punjab's Drug Abuse Prevention and Awareness Efforts
Drug abuse prevention remains a major priority in Punjab, with authorities strengthening efforts...
By Fathima Safa 2026-06-16 10:08:57 0 110
Telangana
అభయ అమృత వర్షిణి బదిరుల పాఠశాలలో పోలీసుల నూతన సంవత్సర వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల...
By Sidhu Maroju 2026-01-01 13:50:48 0 179
Legal
UK Businesses Face Countdown for New Data Protection Law Compliance
The UK Information Commissioner’s Office (ICO) has issued a critical one-month warning to...
By Dunna Jessicaruth 2026-05-19 11:27:57 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com