అభయ అమృత వర్షిణి బదిరుల పాఠశాలలో పోలీసుల నూతన సంవత్సర వేడుకలు.|

0
156

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల (చెవిటి మరియూ మూగ) పాఠశాలలో కమ్యూనిటీ అవుట్ రీచ్ మరియు సమ్ములిత చొరవలో భాగంగా గోపాలపురం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపి)  పి.సుబ్బయ్య విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

మారేడుపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ) నోముల వెంకటేష్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలో మొత్తం 38 మంది పాఠశాల విద్యార్థులు, పాఠశాల నిర్వహకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థుల మధ్యన కేక్ కట్ చేసిన పోలీసు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏసీపీ మరియు ఇతర పోలీసు అధికారులు విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించి, వారికి ధైర్యాన్ని ఉత్సాహాన్ని అందించారు. విద్యార్థుల మధ్యన సంరక్షణ, మరియు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని వారు నొక్కి చెప్పారు. 

తమతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని, ఈరోజును చిరస్మరణీయం చేసినందుకు విద్యార్థులు, మరియు నిర్వాహకులు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. 

హైదరాబాద్ పోలీసుల మానవీయ కోణాన్ని, మరియు స్నేహపూర్వక విధానాన్ని  (people friendly policing)  చాటి చెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. 

ఇది పోలీసులకు మరియు ప్రజలకు మధ్య బంధాన్ని బలోపేతం చేసింది.

#sidhumaroju.

Search
Categories
Read More
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-27 09:14:06 0 129
Andhra Pradesh
శ్రీశైలం ఘాట్ రహదారులో తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం ఘాట్ రహదారిలో తప్పిన పెను ప్రమాదం   అదుపుతప్పి రక్షణ గోడపైకి దూసుకెళ్లిన...
By Rajini Kumari 2025-12-15 07:28:14 0 196
Telangana
‎టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
‎నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్...
By Ponnala Srinivasrao 2026-03-09 11:58:35 0 271
Andhra Pradesh
‘ఆపరేషన్ వజ్రప్రహార్’ లో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలు నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్,ఒంగోలు రైల్వే సీఐ శ్రీ మౌలా షరీఫ్ సూచనలపై, చీరాల జి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 12:27:33 0 310
Telangana
భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్?
కరీంనగర్ జిల్లా  *భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...* కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం...
By Thalakokkula Sadanandam 2026-03-21 07:45:53 1 507
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com