లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.

0
109

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం

అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు

మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు

కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలే కారణమన్న సీఎం చంద్రబాబు

ఇది మహిళలకు చేసిన ద్రోహమని వ్యాఖ్య

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే కాదని, పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం ఆశిస్తున్న లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని హెచ్చరించారు.

 

వివరాల్లోకి వెళితే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ అవసరం కాగా, ఆ మార్కును అందుకోకపోవడంతో బిల్లు వీగిపోయింది. 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఈ పరిణామంపై ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ, మహిళా సాధికారతకు అడ్డుపడిన ప్రతిపక్షాల వైఖరిని ఆయన తప్పుబట్టారు. వారి చర్యల వల్ల దేశం ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మున్సిపల్‌ సమావేశంలో YCP కౌన్సిలర్ల నిరసన.
మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఛైర్మన్ పోడియం...
By Pagadala Venkateswar 2026-01-23 07:30:08 0 171
Andhra Pradesh
పుంగనూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న...
By Kothuru Murali 2026-05-24 17:36:00 0 132
Andhra Pradesh
గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్ద గుడి నందు గొప్ప అన్నదాన కార్యక్రమం
  గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్ద గుడి నందు గొప్ప అన్నదాన...
By John Baji 2025-12-30 01:44:23 0 221
Andhra Pradesh
రంజాన్ రోజుల్లో ప్రార్థనల కోసం వెసులుబాటు,ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వ తేదీ వరకు అనుమతి,సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్ .
రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు/పాఠశాలలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం...
By John Baji 2026-02-11 05:58:30 0 439
Telangana
పెద్దపల్లి : అక్రమ చాపల చెరువులపై ఉక్కు పాదం.
పెద్దపల్లి జిల్లాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహించిన 22...
By Sunka Santhosh 2026-06-16 19:32:40 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com