రంజాన్ రోజుల్లో ప్రార్థనల కోసం వెసులుబాటు,ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వ తేదీ వరకు అనుమతి,సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్ .

0
160

రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు/పాఠశాలలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పనివేళల ముగింపు కంటే ఒక గంట సమయం ముందుగానే ప్రార్థనల నిమిత్తం బయటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 

ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ముస్లిం ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల విభాగ అధిపతులకు, జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు.

 అత్యవసర పరిస్థితులలో తప్ప, రంజాన్ మాసంలో ఒక గంట ముందుగా ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు మతపరమైన ఆచారాలు నిర్వహించుకోవడానికి బయటకు వెళ్లేందుకు అనుమతించే నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో నేడు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం.
మదనపల్లె–బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-18 06:22:29 0 98
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక RACE కమ్యూనికేషన్ వాహనాలు.
అన్నమయ్య జిల్లాలో మారుమూల, సిగ్నల్ వ్యవస్థ లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ను బలోపేతం...
By Pagadala Venkateswar 2026-01-20 06:23:14 0 108
Andhra Pradesh
19న ఘనంగా ఉగాది వేడుకల నిర్వహణ:VZM కలెక్టర్
శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈనెల 19న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు...
By Boiena Rajesh 2026-03-17 13:18:26 0 119
Telangana
#భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై .సునీల్ రావు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు...
By Thalakokkula Sadanandam 2026-03-11 18:01:21 0 568
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని...
By Kothuru Murali 2026-02-14 14:40:34 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com