లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.

0
107

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం

అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు

మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు

కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలే కారణమన్న సీఎం చంద్రబాబు

ఇది మహిళలకు చేసిన ద్రోహమని వ్యాఖ్య

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే కాదని, పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం ఆశిస్తున్న లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని హెచ్చరించారు.

 

వివరాల్లోకి వెళితే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ అవసరం కాగా, ఆ మార్కును అందుకోకపోవడంతో బిల్లు వీగిపోయింది. 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఈ పరిణామంపై ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ, మహిళా సాధికారతకు అడ్డుపడిన ప్రతిపక్షాల వైఖరిని ఆయన తప్పుబట్టారు. వారి చర్యల వల్ల దేశం ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Business & Finance
Heavy Rain Alert Affects Himachal Business and Tourism
The India Meteorological Department has issued continued heavy rainfall warnings for Himachal...
By Navya Sree 2026-07-02 06:57:23 0 124
Telangana
అమ్మకు ఇచ్చే గౌరవమే ప్రతి మహిళకు, సిఐ శివశంకర్
సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతుంటారు. కానీ ఆ మాటలను చేతల్లో చూపిస్తూ...
By Nookapangu Manikanta 2026-05-09 09:44:54 0 112
Telangana
నిజామాబాద్: పెట్రోల్ బంక్ లో బారులుతిరిన జానాo
నిజామాబాద్: పెట్రోల్ బంకులు బంద్  అనాడoథోప్రెట్రోల్ బంకులో బారులుతిరినజనం 
By Sadaq Sadaq 2026-03-24 18:25:03 0 164
Telangana
"ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|
సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ...
By Sidhu Maroju 2026-05-05 11:38:53 0 288
Andhra Pradesh
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రైవేట్ కార్పొరేట్ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే...
By Boya Dasthagiri 2026-05-17 13:42:56 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com