జర్నలిస్టుల అక్రెడిటేషన్లపై కలెక్టరుకు APUWJ కీలక విన్నపం.

0
154

చింతూరు: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) జిల్లా అధ్యక్షులు మాసినేని చంద్రశేఖర్ కోరారు. చింతూరు ఐటీడీఏ (ITDA) కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న ఆలస్యం కారణంగా క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు తమ విధులు నిర్వహించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సంబంధిత కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.               ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు మరియు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు ట్రాఫిక్ నిభందనలు పైన భారీ అవగాహనా.
 గుంటూరు ట్రాఫిక్ నిబంధనలపై భారీ అవగాహన ర్యాలీ – ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎ. అశోక్ కుమార్...
By KOTESWARARAO KVSR 2025-12-24 14:12:14 0 210
Andhra Pradesh
“ఆపిల్‌ గుర్తించిన విశాఖ యువకుడు!”
విశాఖపట్నానికి చెందిన యువ విద్యార్థి Manas Malla ప్రపంచ ప్రఖ్యాత Apple నిర్వహించిన Swift Student...
By Babitha Babitha 2026-05-19 13:00:16 0 59
Andhra Pradesh
కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
*కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు*   •...
By Rajini Kumari 2026-01-22 12:10:16 0 176
Andhra Pradesh
మే 9న మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్ర.
మదనపల్లెలో మే 9న హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ చైతన్య వేదిక నేతలు బాలాజీ, మధు...
By Pagadala Venkateswar 2026-04-11 06:23:29 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com