జర్నలిస్టుల అక్రెడిటేషన్లపై కలెక్టరుకు APUWJ కీలక విన్నపం.

0
155

చింతూరు: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) జిల్లా అధ్యక్షులు మాసినేని చంద్రశేఖర్ కోరారు. చింతూరు ఐటీడీఏ (ITDA) కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న ఆలస్యం కారణంగా క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు తమ విధులు నిర్వహించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సంబంధిత కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.               ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు మరియు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.
చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ...
By Gadiyapudi Narendra 2026-03-02 17:21:39 0 172
Andhra Pradesh
గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటరమణ కాలనీ నాలుగవ లైను ప్రాంతంలో ఆర్గనైజ్డ్ వ్యభిచారం చేస్తున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు
 *గుంటూరు జిల్లా పోలీస్...* *టాస్క్ ఫోర్స్ రైడ్* _*//నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో...
By KOTESWARARAO KVSR 2025-12-23 15:14:38 0 311
Telangana
నిజామాబాద్
అలిండియా అర్గానైజేషన్ అఫ్  కెమిష్ట్ డ్రాగిస్ట్(AIOCD) పిలుపు మెరాకు ఈరోజు దేశవ్యప్తంగ రిటైల్...
By Sadaq Sadaq 2026-05-20 13:41:56 0 42
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com