"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|

0
169

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఎంటమాలజీ సూపర్వైజర్ గణేష్, టీమ్ సభ్యులు సాజిద్, లింగారెడ్డి, మహేందర్ మరియు పోచయ్యలతో కలిసి ఆమె పనులను నిశితంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్రపుడెక్క వల్ల నీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనివల్ల స్థానికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు ఈ గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించడం అత్యవసరమని అధికారులకు సూచించారు.

పనులను వేగవంతం చేయాలని, మళ్లీ గుర్రపుడెక్క పెరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
By Kothuru Murali 2026-05-22 14:22:02 0 35
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By Pulse 2025-05-24 06:19:07 0 3K
Andhra Pradesh
ఎమ్మెల్యే సారు మన ఎమ్మార్వో ఆఫీస్ ఒక్కసారి చూడు... అంటూ నగర పంచాయతీ ప్రజల ఆవేదన
గూడూరు ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం జరిగేనా,,, మండలం లోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలమై దాదాపు 13...
By mahaboob basha 2025-07-23 14:26:13 0 900
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
పుంగనూరులోని టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ నుండి వార్షిక...
By Kothuru Murali 2026-02-18 07:29:37 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com