"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|

0
172

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఎంటమాలజీ సూపర్వైజర్ గణేష్, టీమ్ సభ్యులు సాజిద్, లింగారెడ్డి, మహేందర్ మరియు పోచయ్యలతో కలిసి ఆమె పనులను నిశితంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్రపుడెక్క వల్ల నీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనివల్ల స్థానికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు ఈ గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించడం అత్యవసరమని అధికారులకు సూచించారు.

పనులను వేగవంతం చేయాలని, మళ్లీ గుర్రపుడెక్క పెరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ...
By Pagadala Venkateswar 2026-01-25 12:40:19 0 133
Telangana
అంబేద్కర్ విగ్రహం: తిరిగి ప్రతిష్టించకపోతే కేసులు – బక్కి వెంకటయ్య.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్  వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు...
By Sidhu Maroju 2026-04-10 13:02:08 0 164
Telangana
బీజేపీ నేతలు- హనుమాన్ టెక్డి శ్రీరాముని దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ టెక్డి సెలెక్ట్ టాకీస్ సమీపంలో వెలసిన శ్రీసీతారామచంద్ర...
By Sidhu Maroju 2026-03-27 12:40:50 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com