"బోయిన్‌పల్లి పరిధిలో డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్.|

0
173

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మల్కాజిగిరి జోన్ పోలీసులు మంగళవారం భారీ తనిఖీలు చేపట్టారు. డీసీపీ చౌ. శ్రీధర్ ఐపీఎస్ నేతృత్వంలో సుమారు 300 మంది పోలీసు సిబ్బంది బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.

ఈ మెరుపు దాడుల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 100 ఆక్సిటోసిన్ బాటిల్స్, ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మరియు ఒక హుక్కా పాట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల అనంతరం అధికారులు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచేందుకు, డ్రగ్స్ మరియు ఇతర చట్టవిరుద్ధ పనులను అరికట్టేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు. 

స్థానిక పౌర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్ "ఆరుగ్యారంటీలు" ప్రజలను వంచించేందుకే.. కప్పర వర ప్రసాద్ రావు.|
    హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను...
By Sidhu Maroju 2026-03-16 04:42:13 0 119
Andhra Pradesh
“రాయలసీమ వెనుకబాటుతనానికి రాజకీయాలే కారణమా?”
రాయలసీమ రాజకీయంగా ఎంతో శక్తివంతమైన ప్రాంతం. ఎన్నో ముఖ్యమంత్రులను ఇచ్చినా ఇప్పటికీ అక్కడ నీటి...
By Babitha Babitha 2026-05-18 07:15:55 0 45
Rajasthan
IMD Southwest Monsoon Withdraws Early in West Rajasthan |
The India Meteorological Department (IMD) has announced the early withdrawal of the southwest...
By Pooja Patil 2025-09-15 12:11:46 0 197
Telangana
ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్
రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల...
By Nookapangu Manikanta 2026-05-09 09:26:31 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com