మహనీయుల స్ఫూర్తితో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన రక్తదాన శిభిరం విజయవంతం-CITU

0
195

ఈరోజు మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ జయంతుల సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తుమ్మల.రాజారెడ్డి మాట్లాడుతూ కేవలం కార్మికుల సమస్యలపైన పోరాటాలు, ఆందోళనలు కాకుండా సామాజిక బాధ్యతగా మహనీయుల స్పూర్తితో నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున దాదాపు 150 కి పైగా యువ కార్మికులు హాజరై రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతినెల రక్త మార్పిడి చేయాల్సి ఉంటుందని వారికి చేయూతనిచ్చే విధంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు తమ వంతు బాధ్యతగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గత నెలలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మందమర్రిలో మరియు జ్యోతి బాపూలే, అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఈరోజు శ్రీరాంపూర్లోని నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమానికి అవగాహన కలిగిన యువకుల నుండి భారీ స్పందన వస్తున్నందున త్వరలో మిగిలిన ఏరియాలలోను ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని అంతేకాకుండా కోల్ బెల్ట్ ప్రాంతాలలో త్వరలో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నామని తెలిపారు. సింగరేణి యాజమాన్యం కూడా కార్మికులకు నిర్వహిస్తున్న పీ.ఎం.ఈ టెస్టులలో విటమిన్ లోపం, కిడ్నీ, లివర్ లోపాల తదితర టెస్టులను కూడా చేయాలని సింగరేణి యాజమాన్యానికి సూచించారు. రక్తదాన శిబిరాలకు హాజరై తమ వంతు బాధ్యతగా ఇతరుల ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేసిన యువకులు అందరికీ యూనియన్ తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులతోపాటు పిట్ సెక్రటరీలందరూ పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి.
మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం...
By Pagadala Venkateswar 2026-02-11 05:52:06 0 117
Andhra Pradesh
కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-18 04:16:25 0 39
Telangana
జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు.|
    హైదరాబాద్ : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
By Sidhu Maroju 2026-01-07 06:52:23 0 163
Andhra Pradesh
పుంగనూరులో ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కమిటీ...
By Kothuru Murali 2026-05-20 16:21:38 0 32
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :     నిత్యం ఇంటిని సాకే గృహిణి.   మంచిని...
By Sidhu Maroju 2025-12-02 12:07:52 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com