మహనీయుల స్ఫూర్తితో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన రక్తదాన శిభిరం విజయవంతం-CITU

0
280

ఈరోజు మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ జయంతుల సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తుమ్మల.రాజారెడ్డి మాట్లాడుతూ కేవలం కార్మికుల సమస్యలపైన పోరాటాలు, ఆందోళనలు కాకుండా సామాజిక బాధ్యతగా మహనీయుల స్పూర్తితో నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున దాదాపు 150 కి పైగా యువ కార్మికులు హాజరై రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతినెల రక్త మార్పిడి చేయాల్సి ఉంటుందని వారికి చేయూతనిచ్చే విధంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు తమ వంతు బాధ్యతగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గత నెలలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మందమర్రిలో మరియు జ్యోతి బాపూలే, అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఈరోజు శ్రీరాంపూర్లోని నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమానికి అవగాహన కలిగిన యువకుల నుండి భారీ స్పందన వస్తున్నందున త్వరలో మిగిలిన ఏరియాలలోను ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని అంతేకాకుండా కోల్ బెల్ట్ ప్రాంతాలలో త్వరలో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నామని తెలిపారు. సింగరేణి యాజమాన్యం కూడా కార్మికులకు నిర్వహిస్తున్న పీ.ఎం.ఈ టెస్టులలో విటమిన్ లోపం, కిడ్నీ, లివర్ లోపాల తదితర టెస్టులను కూడా చేయాలని సింగరేణి యాజమాన్యానికి సూచించారు. రక్తదాన శిబిరాలకు హాజరై తమ వంతు బాధ్యతగా ఇతరుల ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేసిన యువకులు అందరికీ యూనియన్ తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులతోపాటు పిట్ సెక్రటరీలందరూ పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
SURAKSHA
Shri Ankur Garg, IAS: Transforming Governance with Vision
A distinguished 2003-batch AGMUT cadre IAS officer, Shri Ankur Garg has combined technological...
By Lokeshwari Panthadi 2026-07-20 10:57:25 0 57
Andhra Pradesh
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్
చెన్నై:    టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..    234 అసెంబ్లీ...
By Rajini Kumari 2026-03-30 04:38:56 0 155
Andhra Pradesh
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల శ్రీవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు అన్ని...
By Benguluri Madhubabu 2026-02-27 03:44:46 0 217
Andhra Pradesh
Nara Lokesh: పవన్ తో అనుబంధం, కాలేజీ రోజుల గురించి... విద్యార్థుల ప్రశ్నలకు నారా లోకేశ్ జవాబులు.
Nara Lokesh: పవన్ తో అనుబంధం, కాలేజీ రోజుల గురించి... విద్యార్థుల ప్రశ్నలకు నారా లోకేశ్ జవాబులు...
By Pagadala Venkateswar 2026-01-31 06:35:26 0 183
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
* *టిడిపి - జనసేన -  కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏 తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి...
By Chennaiah Kati 2026-02-28 03:44:50 0 308
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com