"గంగా అవెన్యూలో ₹24 లక్షల కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని గంగా అవెన్యూలో 2300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఖాళీ స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మాజీీీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సుమారు రూ.24 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులకు మైనంపల్లి హనుమంతరావు ప్రోత్సాహంతో నిధులు మంజూరయ్యాయి.
ఈ కార్యక్రమంలో.. కాలనీ ఆర్డబ్ల్యూఏ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షుడు జోసెఫ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రెహ్మాన్, సభ్యులు సంతోష్ రెడ్డి, రాజు, మహేష్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆంజనేయులు, కల్పన, లక్ష్మీ ప్రసన్న, సరళ, ధనలక్ష్మి తదితరులు హాజరయ్యారు.
అదే విధంగా సమీప కాలనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఎంఈఎస్ కాలనీ నుండి చంద్రశేఖర్ రెడ్డి బృందం, కాశీపురం కాలనీ నుండి మహిపాల్ రావు బృందం, ఎంహెచ్ఆర్ మరియు శ్రీనివాసిక కాలనీలకు చెందిన సంతోష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, లడ్డూ రెడ్డి, శ్రీశైలం యాదవ్, కేబుల్ శేఖర్, నవీన్, డి. స్వామి, రామ్, సంపత్ యాదవ్, సందీప్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz