విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వృద్ధురాలి ఆందోళన

0
101

*Avja విజయవాడ*

 

*విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత – అధికారులపై వృద్ధురాలు కారం చల్లి నిరసన...*

 

*నందిగామ మండలం అనాసాగరం గ్రామంకు చెందిన తులసి అనే వృద్ధురాలు ఈరోజు విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సమావేశంలో ఆందోళనకు దిగింది. తన కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని నేషనల్ హైవే విస్తరణలో తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు సరైన పరిహారం చెల్లించలేదని ఆమె ఆరోపించింది.*

*ఈ నేపథ్యంలో, పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తులసి, సమావేశం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అధికారులపై కారం చల్లి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.*

*సిబ్బంది వెంటనే స్పందించి వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని బయటకు పంపించారు. ఈ ఘటనలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని సమాచారం*.

*వృద్ధురాలు మాట్లాడుతూ, “మూడేళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు*. *మా పొలం తీసుకుని డబ్బులు ఇవ్వలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.*

*ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, విషయం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.
మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన...
By Pagadala Venkateswar 2026-05-22 12:45:54 0 42
Andhra Pradesh
సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ...
By BABJI DADALA 2026-01-12 02:27:10 0 295
Andhra Pradesh
హాస్పిటల్ కి ఐఎస్ఓ సర్టిఫికెట్ : కర్నూలు
కర్నూలు : కర్నూలులోని మెడికెవరు హాస్పిటల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్...
By Hari Krishna 2025-12-25 07:59:38 0 184
Andhra Pradesh
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ ప్రయాగ్రాజ్
శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ (ప్రయాగ్‌రాజ్) ఇంద్రకీలాద్రి సందర్శించారు  ...
By Rajini Kumari 2026-01-01 10:37:18 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com