Arrive Alive లో భాగంగా హెల్మెట్ల పంపిణీ - "పోలీసులు మీకోసం"లో ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు

0
106

కుమురం భీమ్ జిల్లా కేరమేరి మండలం జోడేఘాట్‌లో ఆదివాసి వీరుడు కొమురం భీం విగ్రహానికి రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజియం సందర్శించారుఅనంతరం నిర్వహించిన “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా 1000 మంది ద్విచక్ర వాహనదారులకు నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ బి. శివధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ప్రతి వాహనదారుడికి ప్రాణ రక్షక కవచమని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం అత్యంత అవసరమని సూచించారు.అదేవిధంగా “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా 50 మంది ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, పోలీస్ శాఖ ప్రజల భద్రతతో పాటు వారి సంక్షేమం కోసం కూడా కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆదివాసి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కార్యక్రమం అనంతరం ఆదివాసి కళాకారులు సంప్రదాయ దింసా, గుస్సాడి నృత్యాలను ప్రదర్శించగా, డీజీపీ వాటిని ఆసక్తిగా వీక్షించి కళాకారులతో కలిసి ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ నితికా పంత్, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, వాంకిడి సీఐ సత్యనారాయణ, కేరమేరి ఎస్సై మధుకర్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Telangana
రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని...
By Nookapangu Manikanta 2026-04-25 11:47:01 0 100
Andhra Pradesh
పుంగనూరు: శాంతినగర్లో లోపించిన పారిశుధ్యం
అన్నమయ్య జిల్లా , పుంగనూరు మండలం, భీమగాని పల్లి పంచాయతీ, శాంతినగర్ లో గత కొన్ని రోజులుగా కాలువలలో...
By Kothuru Murali 2026-05-14 13:14:39 0 41
Andhra Pradesh
కులాలకు అతీతమైన నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యం_వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.
◆ కువైట్‌లో జరిగిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన...
By John Baji 2026-01-03 05:41:58 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com