Arrive Alive లో భాగంగా హెల్మెట్ల పంపిణీ - "పోలీసులు మీకోసం"లో ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు
కుమురం భీమ్ జిల్లా కేరమేరి మండలం జోడేఘాట్లో ఆదివాసి వీరుడు కొమురం భీం విగ్రహానికి రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజియం సందర్శించారుఅనంతరం నిర్వహించిన “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా 1000 మంది ద్విచక్ర వాహనదారులకు నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ బి. శివధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ప్రతి వాహనదారుడికి ప్రాణ రక్షక కవచమని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం అత్యంత అవసరమని సూచించారు.అదేవిధంగా “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా 50 మంది ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, పోలీస్ శాఖ ప్రజల భద్రతతో పాటు వారి సంక్షేమం కోసం కూడా కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆదివాసి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కార్యక్రమం అనంతరం ఆదివాసి కళాకారులు సంప్రదాయ దింసా, గుస్సాడి నృత్యాలను ప్రదర్శించగా, డీజీపీ వాటిని ఆసక్తిగా వీక్షించి కళాకారులతో కలిసి ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ నితికా పంత్, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, వాంకిడి సీఐ సత్యనారాయణ, కేరమేరి ఎస్సై మధుకర్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz