"రాఘవేంద్ర కాలనీలో అభివృద్ధికి కొత్త అడుగు – కమిటీ హాల్ ప్రారంభం”.|

0
119

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ఘనంగా ప్రారంభమైంది. ఎం.పి లాడ్స్ ఫండ్స్ మరియు కాలనీ సభ్యుల సహకారంతో నిర్మితమైన ఈ హాల్‌ను మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి మాట్లాడుతూ, కాలనీ అభివృద్ధికి ఇలాంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. స్థానిక ప్రజల ఐక్యతతో ఈ కమిటీ హాల్ నిర్మాణం సాధ్యమైందని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నారాయణ, బీజేపీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్థానికులకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కమిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
కూకట్‌పల్లి అభివృద్ధి పనులపై మేడ్చల్ కలెక్టర్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక సూచనలు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (18-05-2026) నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత...
By Jagadeesh Babu 2026-05-18 16:47:39 0 95
Andhra Pradesh
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు...
బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు...
By Gadiyapudi Narendra 2026-01-23 15:55:43 0 187
Andhra Pradesh
మదనపల్లెలో ఇరువర్గాల ఘర్షణ.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన...
By Pagadala Venkateswar 2026-04-20 03:22:04 0 66
Andhra Pradesh
Nara Lokesh: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు.. ఖాళీల భర్తీపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామన్న మంత్రి ప్రైవేటుకు దీటుగా...
By Pagadala Venkateswar 2026-02-24 08:15:39 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com