గాయని మంగ్లీ కేసుతో నాకు ‎ఎలాంటి సంబంధం లేదు"

0
164

ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఈ అసత్య వార్తలపై వివరణ ఇచ్చారు దర్శకుడు వేణు ఊడుగుల. మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.వేణు ఊడుగుల స్పందిస్తూ - "గాయని మంగ్లీ కేసులో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న వార్తలు చూసి బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా పాత్ర. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో కూడా నిందితుడిగా నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదని నిర్థారించారు. మీ వార్తల వల్ల ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ప్రభావితం అవుతాయని మీడియా మిత్రులు గమనించగలరు. మీరు నాపై ఇంతకాలం చూపిన ప్రేమ, ఆదరణ నాకెంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడూ అదే ప్రేమను కొనసాగిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
    హైదరాబాద్ :  GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల)...
By Sidhu Maroju 2025-12-30 17:10:29 0 179
Andhra Pradesh
రూ.3.10 కోట్ల రోడ్డు పని... నాణ్యత ఏది ?
చింతూరు మండలం రత్నపురం నుండి అల్లిగూడెం వరకు 4కిలోమీటర్ల  పనులు 3.10 కోట్లు మంజూరు...
By Shyamala Yadagiri 2026-04-04 03:51:22 0 266
SURAKSHA
: పెద్దలకు భరోసా - ఒంటరి వృద్ధులకు AP పోలీస్ తోడుగా
 ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్ల రక్షణ కోసం AP పోలీస్ "పెద్దలకు భరోసా" ప్రత్యేక కార్యక్రమం...
By Kalaga Sailaja 2026-07-01 09:24:43 0 60
Telangana
భావితరాల కోసం రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావితరాలకు మేలు కలగాలని లక్ష్యంగా పెట్టుకుని లక్షేట్టిపేట్...
By Avunoori Mahesh 2026-04-13 13:08:08 0 146
Andhra Pradesh
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ...
By Benguluri Madhubabu 2026-03-04 03:01:19 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com