మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారికి షాబుకారి ఉరుసు ఆహ్వానం

0
105

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి షాబుఖారి ఉరుసు మహోత్సవ ఆహ్వానం.

 

ఇస్లాం సంప్రదాయ ప్రకారం సన్మానించి ఆహ్వానం అందజేసిన ఉరుసు కమిటీ సభ్యులు.

 

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 23.12.2025.

 

కొండపల్లిలో ఈ నెల 29, 30, 31 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి మంగళవారం అందజేశారు. ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా గారి ఆధ్వర్యంలో గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు. ఇస్లాం సంప్రదాయ ప్రకారం శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ హజ్రత్ సయ్యద్ షాబుఖారి బాబా ఉరుసు మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి తగు చర్యలు చేపడతామన్నారు. అల్లాహ్ ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు :అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు నియోజకవర్గ పోలీస్ స్టేషన్లు
పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ...
By Kothuru Murali 2026-01-22 13:03:51 0 75
Andhra Pradesh
ఎగ్జిబిషన్లో తనకి పశ్చిమ తహసిల్దార్ ఇన్చార్జి రిబ్కా రాణి
*విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంచార్జి గా* *ఉన్న డి రిబ్కా రాణి*  *మంగళవారం*   *సితార...
By Rajini Kumari 2026-01-13 16:16:00 0 74
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో భవన కార్మికునికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు ఉదయ్...
By Pagadala Venkateswar 2026-01-26 05:39:19 0 55
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com