మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారికి షాబుకారి ఉరుసు ఆహ్వానం

0
151

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి షాబుఖారి ఉరుసు మహోత్సవ ఆహ్వానం.

 

ఇస్లాం సంప్రదాయ ప్రకారం సన్మానించి ఆహ్వానం అందజేసిన ఉరుసు కమిటీ సభ్యులు.

 

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 23.12.2025.

 

కొండపల్లిలో ఈ నెల 29, 30, 31 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి మంగళవారం అందజేశారు. ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా గారి ఆధ్వర్యంలో గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు. ఇస్లాం సంప్రదాయ ప్రకారం శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ హజ్రత్ సయ్యద్ షాబుఖారి బాబా ఉరుసు మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి తగు చర్యలు చేపడతామన్నారు. అల్లాహ్ ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 3K
Telangana
కూల్చివేతల సెగ తగలకుండా ఆధ్యాత్మిక కార్డు.. సీఎం.ది మాస్టర్ ప్లానా? లేక ముందస్తు డైవర్షనా?".|
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఇప్పుడు...
By Sidhu Maroju 2026-03-27 14:05:32 0 88
Telangana
“మల్లారెడ్డి కాలనీలో ట్రాఫిక్ పరిష్కారానికి చర్యలు – ప్రత్యామ్నాయ రోడ్‌పై చర్చ”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్లారెడ్డి కాలనీలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై స్థానిక నివాసితులు...
By Sidhu Maroju 2026-03-17 10:28:08 0 152
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com