ట్రెండ్ ను ఫాలో కావొద్దు... సవాళ్లను స్వీకరించండి: బెంగళూరులో నారా లోకేశ్.

0
76

యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్‌ను అనుసరించకుండా నిర్దిష్ట లక్ష్యంపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. బెంగళూరులోని సర్జాపూర్‌లో ఉన్న గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ (గ్రేడ్-12) 2026 గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

 

షార్ట్‌కట్‌లతో నిండిన ప్రస్తుత ప్రపంచంలో నైతికతే గొప్ప బలమని లోకేశ్ అన్నారు. "కేవలం ఏం నేర్చుకున్నారన్నది కాకుండా, ఎలా ఆలోచిస్తున్నారనేదే అత్యంత ముఖ్యం. ఎవరూ చూడనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది" అని విద్యార్థులకు హితవు పలికారు. లక్ష్య సాధనలో పట్టుదలతో ఉండాలని, ఎదురయ్యే అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవాలని సూచించారు.

 

ఈ పర్యటన సందర్భంగా మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తోందని, త్వరలోనే ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతోందని వెల్లడించారు. గ్రీన్‌వుడ్ హై స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో పౌరులను (గ్లోబల్ సిటిజన్స్) తయారు చేస్తుండటం గర్వకారణమని ఆయన ప్రశంసించారు.

 

అంతకుముందు, పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్కూల్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆర్ట్ గ్యాలరీ, తరగతి గదులను సందర్శించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన లోకేశ్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి, వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల తీర ప్రాంత అభివృద్ధికి అనువైన విధానాలను రూపొందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్.
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి బృందం, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్,...
By Gadiyapudi Narendra 2026-02-20 05:50:08 0 143
Telangana
కరాటే ఛాంపియన్ షిప్ బంగారు పతక విజేతకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గం లోని బాలంరాయికి చెందిన మంచోళ్ళ సాయికుమార్...
By Sidhu Maroju 2025-11-05 07:10:05 0 220
Andhra Pradesh
మరోసారి బొత్సకు అస్వస్థత
శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ...
By Boiena Rajesh 2026-03-06 12:22:25 0 187
Andhra Pradesh
కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ప్రారంభం :
కర్నూలు సిటీ :  కలెక్టర్ కార్యాలయంలో  స్పెషల్ కంట్రోల్ రూమ్  నూతన గదిని...
By Hari Krishna 2025-12-31 11:29:48 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com