"బస్తీ అభివృద్ధికి తలసాని బాట… ప్రజల మాటకే ప్రాధాన్యం.|

0
187

సికింద్రాబాద్: బస్తీ వాసుల అభీష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడతామని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

శుక్రవారం రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని జీరా బస్తీ, పరిసర కాలనీలలో ఆయన అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జీరా గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కమిటీ హాల్ నిర్మాణం కోసం పరిశీలించిన ఎమ్మెల్యే, బస్తీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూ.19 లక్షల వ్యయంతో జీ ప్లస్ వన్ విధానంలో కమిటీ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు.

అనంతరం జీరా బస్తీలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయనకు, వర్షాకాలంలో ఆలయం లీకేజీ సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆలయ మరమ్మతుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.

తదుపరి బస్తీలోని టాయిలెట్లను పరిశీలించిన ఆయన, అవి ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయని స్థానికులు తెలిపిన నేపథ్యంలో, కొత్త టాయిలెట్ల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అక్కడి నుంచి గార్డెన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, పచ్చదనాన్ని పెంచుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. గార్డెన్‌లోని పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం బాలాజీ జీరా బస్తీలో పర్యటించిన సందర్భంగా, ఒక నీటి ట్యాంక్ నిర్మించాలని మహిళలు కోరగా, వాటర్ వర్క్స్ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక కమిటీ హాల్ శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం నిర్మించాలని కోరగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

జీరా ప్రాంతంలో పర్యటించడం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే లక్ష్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు
బాపట్ల జిల్లా:  చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను  సందర్శించిన...
By Gadiyapudi Narendra 2026-02-12 13:05:09 0 195
Andhra Pradesh
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు 30-01-2026 Fri...
By Pagadala Venkateswar 2026-01-31 06:23:21 0 278
Andhra Pradesh
ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి...
By Mobbu Venkatramana 2026-02-04 04:37:32 0 439
Telangana
శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ- పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం నియోజకవర్గం...
By Sidhu Maroju 2025-12-25 10:02:08 0 205
Dadra &Nager Haveli, Daman &Diu
Daman & Diu Shine at Khelo India Beach Games, Lead Medal Tally with Golden Pencak Silat Sweep
Daman & Diu Shine at Khelo India Beach Games, Lead Medal Tally with Golden Pencak Silat Sweep...
By BMA ADMIN 2025-05-23 06:25:03 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com