మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత… ఫుట్‌పాత్ షాపుల తొలగింపు.|

0
174

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన చిన్నపాటి దుకాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు కలిసి తొలగించే చర్యలు చేపట్టారు.

అధికారులు ఉదయం నుంచే భారీ బందోబస్తుతో రంగంలోకి దిగి, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఫుట్‌పాత్‌లపై ఉన్న షాపులను తొలగించడంతో స్థానిక చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు.

“సామాన్లు సర్దుకునేంత సమయం కూడా ఇవ్వకుండా తొలగిస్తున్నారు” అంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారాన్ని ఒక్కసారిగా దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు.

ఇక అధికారులు మాత్రం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న అక్రమ ఆక్రమణలను తొలగించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ రాయచోటి
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లి లో వెలిసినటువంటి శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ నందు...
By Benguluri Madhubabu 2026-01-17 06:39:31 0 320
Andhra Pradesh
పోలీసులను ఆశ్రయించిన ప్రేమా జంట
నరసరావుపేట :-  ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ...
By Bhesetti Lovaraju 2026-01-29 13:22:43 0 538
Telangana
ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad...
By Sidhu Maroju 2026-03-28 11:10:47 0 157
Tamilnadu
Supreme Court Reviews Tamil Nadu Medical Seat Transfer
The Supreme Court has agreed to examine a petition challenging the Tamil Nadu government's...
By Navya Sree 2026-06-25 13:11:09 0 78
Telangana
తెలంగాణ : ఈనెల 30న రైతు భరోసా...!
తెలంగాణ : వానకాలం రైతు భరోసా నిధులపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. తొలుత ఈనెల 26న నిధులు విడుదల...
By Sunka Santhosh 2026-06-18 19:22:55 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com