అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి

0
115

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎండౌమెంట్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఏఈ, ఈఓ మరియు సిబ్బందితో కలిసి దేవాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా గోపురాల నిర్మాణం, పెయింటింగ్, కంపౌండ్ వాల్, కళ్యాణ మండపాలు మరియు ఇతర సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.

నందవరం మండలం గురుజాల రామలింగేశ్వర స్వామి ఆలయం, గోనేగండ్ల మండలం చింతలముని స్వామి ఆలయం, ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల చెన్నకేశవ స్వామి ఆలయం, అలాగే ఎమ్మిగనూరు పట్టణంలోని రామస్వామి ఆలయం, పాత ఆంజనేయ స్వామి ఆలయం మరియు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని పేర్కొంటూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.

ఈ సమావేశంలో ఎండౌమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్, ఏఈ, ఈఓ, సిబ్బంది, ఆలయ పూజారులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Sports
BACK-TO-BACK CENTURIES FROM CAPTAIN GILL!
The Indian skipper is in fine form as he scores his 2nd century of the tour! Take a bow, Shubman...
By Bharat Aawaz 2025-07-02 17:50:04 0 2K
Andhra Pradesh
తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.
మదనపల్లి మండలం తట్టువారిపల్లి సచివాలయం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ దీపతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-02-03 12:36:39 0 113
Telangana
నర్సంపేట మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా....!
నర్సంపేట: మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా......!   భారత్ అవాజ్ న్యూస్: 13 మే ఈ రోజు...
By Gujile Ramu 2026-05-13 07:48:37 0 55
Telangana
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
By Sadaq Sadaq 2026-04-24 12:09:06 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com