"దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|

0
179

సికింద్రాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద నుండి సుమారు రూ.7.5 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భారత ఆర్మీలో సుమారు 30 సంవత్సరాలు సేవలందించి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే షేర్ మార్కెట్‌లో నష్టాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాట్ల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనివాస్ రెడ్డి, తన దురవాట్లు మరియు కుటుంబ అవసరాల కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ నెల 2, 3 తేదీలలో కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారైన ఘటనల్లో ఇతని ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు . 

అతని కోర్టులో హాజరుపరచగా తదుపరి విచారణ కొనసాగుతోందని రైల్వే అధికారులు తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
కాదంతోక్కి కదలిరండి..... జర్నలిస్టుల భద్రతే లక్ష్యం
రాష్ట్ర కన్వీనర్లు పర్కాల సమ్మయ్య గౌడ్,  బజ్జుర్ల శ్రీనివాస్. జనవరి 5న హైదరాబాద్ ఉప్పల్లో...
By CM_ Krishna 2025-12-29 03:57:57 0 258
IINNSIDE
"ఏపీ పవన్ కళ్యాణ్ గారి బాటలో తమిళనాడు విజయ్ దళపతి అడుగులు"
పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేయాలనుకుంటున్నాడు. 2019 ఏపీ ఎన్నికల్లో రెండు...
By Thokala Sivaji 2026-03-29 15:30:53 0 430
Telangana
"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|
సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన...
By Sidhu Maroju 2026-05-23 07:07:01 0 59
Andhra Pradesh
Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.
రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం ఐటీ,...
By Pagadala Venkateswar 2026-02-04 08:01:41 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com