జాతీయస్థాయిలో వేములవాడ ఉపాధ్యాయురాలు ప్రతిభ

0
169

భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల టీఎల్‌ఎం (బోధన అభ్యసన సామాగ్రి) పోటీల్లో వేములవాడ పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు కోడం రాధిక సత్తా చాటారు. పరమాణువు నిర్మాణం (Atomic Structure) అంశంపై ఆమె రూపొందించిన నమూనాకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.

​ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో రాధికను ప్రధానోపాధ్యాయులు బి. బన్నాజి నేతృత్వంలో తోటి ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ విజయంతో పాఠశాల కీర్తి జాతీయ స్థాయికి చేరిందని, విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెంచుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. కృష్ణ, వి. బాలరాజు, పి. సత్యనారాయణ, ఏ. సరళ, టి. సరిత, టి. బాబు రాజు, జె. రవీందర్ రావు, ఎన్. స్వాతి, సి.హెచ్. అరుంధతి తదితరులు పాల్గొని రాధికకు అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే
ఖాళీ ప్లాట్‌లలో బోర్డులు ఏర్పాటు చేయనున్న జీహెచ్ఎంసీ. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ...
By Sidhu Maroju 2025-06-03 15:52:33 1 2K
Andhra Pradesh
అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి...
By Benguluri Madhubabu 2026-04-18 14:12:04 0 152
Andhra Pradesh
పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...
By Kothuru Murali 2026-01-23 12:54:57 0 134
Telangana
సీయం దిష్టిబొమ్మ దహనం అడగింపు
సిట్ విచారనాకు వ్యతిరేకంగా సియం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడనికి brs నాయకులు ఆదివారము...
By Sadaq Sadaq 2026-02-01 11:23:02 0 246
Telangana
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ నీటి వివాదం: శ్రీశైలం ప్రాజెక్టుపై భట్టి విక్రమార్క హెచ్చరిక
నీటి వివాదం: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య శ్రీశైలం రిజర్వాయర్ నీటి వాటాపై ఉద్రిక్తతలు...
By Triveni Yarragadda 2025-08-11 14:15:02 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com