జాతీయస్థాయిలో వేములవాడ ఉపాధ్యాయురాలు ప్రతిభ

0
265

భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల టీఎల్‌ఎం (బోధన అభ్యసన సామాగ్రి) పోటీల్లో వేములవాడ పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు కోడం రాధిక సత్తా చాటారు. పరమాణువు నిర్మాణం (Atomic Structure) అంశంపై ఆమె రూపొందించిన నమూనాకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.

​ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో రాధికను ప్రధానోపాధ్యాయులు బి. బన్నాజి నేతృత్వంలో తోటి ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ విజయంతో పాఠశాల కీర్తి జాతీయ స్థాయికి చేరిందని, విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెంచుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. కృష్ణ, వి. బాలరాజు, పి. సత్యనారాయణ, ఏ. సరళ, టి. సరిత, టి. బాబు రాజు, జె. రవీందర్ రావు, ఎన్. స్వాతి, సి.హెచ్. అరుంధతి తదితరులు పాల్గొని రాధికకు అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి.
AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే...
By Pagadala Venkateswar 2026-01-24 06:39:18 0 169
Andhra Pradesh
ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.
📍 గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఈ నెల 3,4, 5వ...
By John Baji 2026-01-03 11:25:08 0 224
Telangana
బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.|
హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని,...
By Sidhu Maroju 2026-03-28 06:16:08 0 172
Andhra Pradesh
కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి...
By Ratna Sekhar 2026-02-19 20:17:49 0 1K
Andhra Pradesh
పుంగనూరు: మేము ప్రమాణానికి సిద్ధం మరి మీరు... కొత్తూరు మురళి
బుధవారం పుంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు, పార్టీ...
By Kothuru Murali 2026-03-20 06:10:35 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com