కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.

0
118

వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి చెందింది. దువ్వూరు మండలం చిన్నబకరాపురం గ్రామ శివార్లలో ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్రమైన ఎండల కారణంగా అడవిలో నీటి వనరులు అడుగంటిపోవడంతో, దాహం తీర్చుకోవడానికి చిరుత కూన గ్రామంలోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

 

గ్రామ శివార్లలోని రైతు పుల్లారెడ్డి పొలంలో చిరుత కూన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నీటి కోసం వచ్చిన చిరుతను వీధి కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేయడంతో అది ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

అనంతరం, చిరుత కూన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత కూన మృతి చెందడంతో పొలాల్లో చిరుత పులుల సంచారం ఉందేమోనని రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం
ప్రచునార్థం  19.1.26     *రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన...
By Rajini Kumari 2026-01-19 11:30:29 0 129
Andhra Pradesh
పూర్ణాహుతి తో ఘనంగా ముగిసిన భవానీ దీక్ష ఉత్సవాలు
*పూర్ణాహుతితో వైభవంగా*   *ముగిసిన భవానీ దీక్షల ఉత్సవాలు*        ...
By Rajini Kumari 2025-12-15 10:54:18 0 176
Andhra Pradesh
ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.
ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం 11-04-2026 Sat 07:08 | Andhra APSRTC...
By Pagadala Venkateswar 2026-04-11 06:47:50 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com