కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.

0
153

వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి చెందింది. దువ్వూరు మండలం చిన్నబకరాపురం గ్రామ శివార్లలో ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్రమైన ఎండల కారణంగా అడవిలో నీటి వనరులు అడుగంటిపోవడంతో, దాహం తీర్చుకోవడానికి చిరుత కూన గ్రామంలోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

 

గ్రామ శివార్లలోని రైతు పుల్లారెడ్డి పొలంలో చిరుత కూన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నీటి కోసం వచ్చిన చిరుతను వీధి కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేయడంతో అది ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

అనంతరం, చిరుత కూన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత కూన మృతి చెందడంతో పొలాల్లో చిరుత పులుల సంచారం ఉందేమోనని రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసులు నేడు: రక్తదాన వీరులుగా జీవాలు కాపాడారు
నేడు AP పోలీసులు “రక్తదానం జీవనదానం” శిబిరాలు 15 జిల్లాల్లో నిర్వహించారు. 24 గంటల్లో...
By Kalaga Sailaja 2026-07-04 09:21:03 0 32
Uttarkhand
Uttarakhand Expands Healthcare Infrastructure Access
Uttarakhand has prioritized the expansion of healthcare infrastructure to improve medical...
By Fathima Safa 2026-06-16 12:24:10 0 144
Andhra Pradesh
🌾 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యమం
🌾 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం 🌾 తేది: 20-06-2026 (శనివారం) 🕒 సమయం: మధ్యాహ్నం...
By Chennaiah Kati 2026-06-19 16:15:51 0 79
Andhra Pradesh
100 రోజుల ప్రణాళిక,!! సెట్కూర్ CEO
కర్నూలు : వంద రోజుల ప్రణాళిక అమలు కావాలి: సెట్కూరు సీఈఓ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఏపీ క్యాంప్...
By Hari Krishna 2025-12-21 14:02:53 0 197
Telangana
తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 14:53:41 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com