కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.

0
154

వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి చెందింది. దువ్వూరు మండలం చిన్నబకరాపురం గ్రామ శివార్లలో ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్రమైన ఎండల కారణంగా అడవిలో నీటి వనరులు అడుగంటిపోవడంతో, దాహం తీర్చుకోవడానికి చిరుత కూన గ్రామంలోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

 

గ్రామ శివార్లలోని రైతు పుల్లారెడ్డి పొలంలో చిరుత కూన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నీటి కోసం వచ్చిన చిరుతను వీధి కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేయడంతో అది ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

అనంతరం, చిరుత కూన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత కూన మృతి చెందడంతో పొలాల్లో చిరుత పులుల సంచారం ఉందేమోనని రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.
రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:49:44 0 156
Business & Finance
Protect Your Rights with Legal Notice Services in India
A professionally drafted legal notice is the first step toward resolving disputes effectively....
By Navya Sree 2026-07-14 05:42:23 0 36
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి APCC చీఫ్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
scroll    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-28 09:46:26 0 174
Andhra Pradesh
ఏపీలో మళ్లీ కరోనా కలకలం... నలుగురి మృతి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా...
By Pagadala Venkateswar 2026-07-17 05:41:40 0 28
Andhra Pradesh
రొంపిచర్ల క్రాస్ లో కోళ్ల లారీ బోల్తా
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ లో సోమవారం తిరుపతి నుంచి కల్లూరుకు వెళుతున్న కోళ్ల లారీ...
By Kothuru Murali 2026-01-05 12:53:57 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com