America blast their own aircraft

0
157

America: రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా!

06-04-2026 Mon 12:22 | International

America Destroys Own Aircraft Worth Rs 931 Crore in Iran

 

షార్ట్స్‌లో చూడండి

ఇరాన్ భూభాగంలో తమకు చెందిన అత్యాధునిక విమానాన్ని అమెరికా స్వయంగా బాంబులతో పేల్చివేసింది. సుమారు 931 కోట్ల రూపాయల ($100 మిలియన్లు) విలువైన ఈ విమానాన్ని శత్రుదేశానికి చిక్కకూడదనే ఏకైక కారణంతో ధ్వంసం చేసింది. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

 

వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ ఫైటర్ పైలట్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం రహస్యంగా ఒక ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో పైలట్‌ను తరలించేందుకు వెళ్లిన విమానాల్లో ఒకటి సాంకేతిక లోపంతో ఎడారి ప్రాంతంలో నిలిచిపోయింది. ఆ విమానంలో అత్యంత కీలకమైన సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రహస్య యుద్ధ సాంకేతికత ఉన్నాయి.

 

ఈ టెక్నాలజీ ఇరాన్ చేతికి చిక్కితే తమ సైనిక రహస్యాలు బయటపడతాయని అమెరికా భావించింది. ఆర్థికంగా భారీ నష్టమైనా భరించి, దేశ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అక్కడున్న కమాండోలు ఆ విమానాన్ని పేల్చివేసి, పైలట్‌ను మరో విమానంలో సురక్షితంగా తరలించారు. ఈ ఘటన 1980లో జరిగిన ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ వైఫల్యాన్ని గుర్తుచేస్తోంది. అప్పట్లో కూడా అమెరికా తమ విమానాలను ఇరాన్ ఎడారిలో వదిలిరావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈసారి అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా అమెరికా జాగ్రత్త పడింది.

 

ప్రస్తుతం ఇరాన్ ఈ విమాన శకలాల ఫొటోలను విడుదల చేస్తూ, అమెరికా ఆపరేషన్ విఫలమైందని ప్రచారం చేస్తోంది. అయితే, వందల కోట్ల ఆస్తి కన్నా సైనిక రహస్యాలకే ఎక్కువ విలువిస్తామని ఈ చర్య ద్వారా అమెరికా స్పష్టం చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల.
TTD: రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల 17-03-2026...
By Pagadala Venkateswar 2026-03-17 12:51:22 0 129
Andhra Pradesh
2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..
2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత...
By John Baji 2025-12-29 12:51:04 0 150
Andhra Pradesh
నేటి నుండి బాపట్ల జిల్లాలోని  ప్రతి గ్రామ పంచాయితీ కేంద్రం నందు రెండు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది.
నేటి నుండి బాపట్ల జిల్లాలోని  ప్రతి గ్రామ పంచాయితీ కేంద్రం నందు రెండు గ్రామ సభలు నిర్వహించడం...
By Gadiyapudi Narendra 2026-01-05 06:26:58 0 197
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర
పుంగనూరు పట్టణంలో ఆదివారం చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు....
By Kothuru Murali 2026-02-23 12:04:09 0 104
Andhra Pradesh
సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
 సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా...
By John Baji 2026-01-02 08:35:33 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com