గోహత్యల నివారణ ధ్యేయంగా ఏప్రిల్ 27న గో సన్మాన ఆహ్వానం అభియాన్ కార్యక్రమం

0
230

*గోహత్యల నివారణే ధ్యేయం గా ఏప్రిల్ 27న ‘గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం*

 

*విజయవాడ:* దేశంలో గోహత్యలను పూర్తిగా అరికట్టి, గోమాతకు తగిన గౌరవాన్ని, స్థానాన్ని తిరిగి కల్పించడమే లక్ష్యంగా,గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్, (గో గౌరవ ఆహ్వాన ఉద్యమం) పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉద్యమ ప్రతినిధులు వెల్లడించారు. శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోవత్ కిరణ్ కృష్ణ, సభ్యులు హరిసింగ్, కృష్ణ, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉద్యమానికి ఏ వ్యక్తి లేదా సాధువులు నాయకత్వం వహించడం లేదని స్వయంగా గోమాత ప్రధాన సంరక్షకుడు నంది బాబా అధ్యక్షతన వారి మార్గదర్శకత్వంలోనే ఈ ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. నిర్దాక్షిణ్యంగా కోతకు గురవుతున్న సుమారు 80 వేల గోవుల ప్రాణాలను రక్షించాలని, గోహత్యలపై భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 27, 2026న ఈ అభియాన్ లో భాగంగా ఒక 

సంతకాల సేకరణ (సిగ్నేచర్ కాంపెయిన్) నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సంతకాలు చేసి ఆ పత్రాలను ప్రభుత్వ అధికారులకు అందజేయాలని కోరారు.

గోమాత హోదా గోవును కేవలం జంతువుగా కాకుండా మన సంస్కృతికి మూలమైన 

రాష్ట్ర మాత రాష్ట్ర దేవిగా 

గుర్తించాలని ఈ అభియాన్ డిమాండ్ చేస్తోంది అన్నారు.

 

సభ్యులు హరిసింగ్ మాట్లాడుతూ సనాతన ధర్మంలో పుట్టినప్పటి నుండి మరణం వరకు గోవుకు విడదీయలేని సంబంధం ఉందని గుర్తుచేశారు. ఒకప్పుడు ప్రతి 15-18 మందికి ఒక ఆవు ఉండేదని, నేడు ఆ పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జెర్సీ ఆవు పాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, భారతీయ దేశీ ఆవు పాల విశిష్టతను గుర్తించాలని,శాంతియుత మార్గంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గోహత్యలను నిరోధించడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు...

Search
Categories
Read More
Telangana
జనవరి 18న ఛలో ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా...
By Bheeshman King 2026-01-16 13:24:26 0 932
Andhra Pradesh
Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా...
By Pagadala Venkateswar 2026-01-26 05:55:44 0 186
Andhra Pradesh
ఆ మృతదేహం ఆచూకీ లభ్యం.
మదనపల్లె మండలం కొండామారిపల్లె సమీపంలో బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి...
By Pagadala Venkateswar 2026-05-16 05:10:43 0 93
Andhra Pradesh
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్..
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్.....
By Chennaiah Kati 2026-06-11 08:21:14 0 106
Andhra Pradesh
దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయండి ఫిబ్రవరి 12వ తారీకు
దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా. ఫిబ్రవరి 12. తేదీ న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ. ఊర్మిల సుబ్బారావు...
By Rajini Kumari 2026-02-07 11:46:54 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com