హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు

0
103

వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య,పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చదువులో క్రమశిక్షణ ఎంతో అవసరమని,అది జీవితములో చక్కటి మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు.తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించిన నాడే ఆదర్శ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడని తెలిపారు. చదువుతోపాటు వివిధ పోటీలలోనూ, క్రీడారంగములోనూ రాణించాలని,తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలతో పాటు వారి చదువుల పట్ల కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతో ఉందని తెలిపారు. చదువు అనేది దొంగతనం చేయని వస్తువు లాంటిదని,చదువుకు వయస్సు నిమిత్తం లేదని, పేదరికంతో జీవించేవారు కూడా చక్కటి చదువును అనుభవించిన దాఖలాలు కలవని తెలిపారు. గురు శిష్యుల అనుబంధంతోనే మంచి మార్గంతో కూడిన చదువు లభిస్తుందని,చదువులో బాగా రాణించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, జీవితంలో సాధించాలన్న తపన ఉండాలని తెలిపారు. తదుపరి విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పొగడదండ రవి కుమార్,పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, అమరావతి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం రెడ్డివారిపల్లి సమీపంలో అన్ని అనుమతులు ఉన్న...
By Kothuru Murali 2026-01-08 12:58:02 0 113
Andhra Pradesh
డ్రైనేజీ మురికి నీటితో నిత్యం దర్శనం ఇస్తున్న గ్రామం... ఈ సమస్య తీరేది ఎప్పుడు - ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ మేజర్ పంచాయతీ పరిధిలో నేషనల్...
By BABJI DADALA 2025-12-24 06:27:10 0 297
Telangana
శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన...
By Sidhu Maroju 2026-04-05 08:26:18 0 98
Andhra Pradesh
బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు: ఆసుపత్రికి తరలింపు
చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి పుంగనూరు - చౌడేపల్లె...
By Kothuru Murali 2026-02-26 12:42:46 0 77
Andhra Pradesh
వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు వినతిపత్రం అందజేసిన ముస్లిం సంఘాల నాయకులు అబ్దుల్ కలాం, నాగుల్ మీరా, నూర్ ఖాన్.
అంజుమన్-ఎ-ఇస్లామియా, గుంటూరు సంస్థకు చెందిన నోటిఫై చేసిన వక్ఫ్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట...
By John Baji 2026-01-02 02:35:53 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com