కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు.. ఆదివారం వన్‌వే ట్రయల్.|

0
241

హైదరాబాద్ : నగర ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం... కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వన్‌వే ట్రయల్ అమలు చేయబడుతుందని తెలిపారు. ఈ ట్రయల్‌లో భాగంగా కొన్ని ప్రధాన రహదారులపై వాహన రాకపోకలకు మార్పులు ఉంటాయని చెప్పారు. ట్రయల్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఇదే మార్గాలను శాశ్వతంగా అమలు చేసే అవకాశముందని పేర్కొన్నారు.

పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెంబర్ 2 ద్వారా ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, 10 మీదుగా రోడ్ నెంబర్ 45కి మళ్లించనున్నారు. అలాగే మాదాపూర్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ముందుగా రోడ్ నెంబర్ 2 వైపు మళ్లించనున్నారు.

రోడ్ నెంబర్ 10, 12 ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మార్గంలో జూబ్లీ చెక్‌పోస్ట్ ద్వారా కేబీఆర్ పార్క్ చేరుకునేలా డైవర్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ట్రాఫిక్ మార్పులను గమనించి, పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని నగర ప్రజలను కోరారు.

#sidhumaroju 

Alwal

 

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లి: ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులపై కుమారుడి దాడి.
నిమ్మనపల్లి మండలంలో గురువారం సాయంత్రం ఆస్తి రాసివ్వలేదన్న కారణంతో తల్లిదండ్రులపై కుమారుడు దాడి...
By Pagadala Venkateswar 2026-01-23 07:36:56 0 177
Telangana
"మల్కాజిగిరి కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయం ప్రారంభం."|
"ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం: డీజీపీ సీ.వి. ఆనంద్." మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-06-17 09:24:46 0 120
Andhra Pradesh
ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.
చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ...
By Gadiyapudi Narendra 2026-03-02 17:21:39 0 225
Andhra Pradesh
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం..
బాపట్ల: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం. బాపట్ల చేపల మార్కెట్లో  చాపల...
By Gadiyapudi Narendra 2026-01-20 12:00:48 0 217
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుకు జగన్ ఫోన్‌... పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా.
అంబటిని ఫోన్‌లో పరామర్శించిన జగన్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని తీవ్ర విమర్శ  ...
By Pagadala Venkateswar 2026-02-01 08:45:55 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com