కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు.. ఆదివారం వన్‌వే ట్రయల్.|

0
96

హైదరాబాద్ : నగర ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం... కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వన్‌వే ట్రయల్ అమలు చేయబడుతుందని తెలిపారు. ఈ ట్రయల్‌లో భాగంగా కొన్ని ప్రధాన రహదారులపై వాహన రాకపోకలకు మార్పులు ఉంటాయని చెప్పారు. ట్రయల్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఇదే మార్గాలను శాశ్వతంగా అమలు చేసే అవకాశముందని పేర్కొన్నారు.

పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెంబర్ 2 ద్వారా ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, 10 మీదుగా రోడ్ నెంబర్ 45కి మళ్లించనున్నారు. అలాగే మాదాపూర్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ముందుగా రోడ్ నెంబర్ 2 వైపు మళ్లించనున్నారు.

రోడ్ నెంబర్ 10, 12 ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మార్గంలో జూబ్లీ చెక్‌పోస్ట్ ద్వారా కేబీఆర్ పార్క్ చేరుకునేలా డైవర్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ట్రాఫిక్ మార్పులను గమనించి, పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని నగర ప్రజలను కోరారు.

#sidhumaroju 

Alwal

 

Search
Categories
Read More
Andhra Pradesh
నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ...
By Gadiyapudi Narendra 2026-02-21 07:14:22 0 125
Andhra Pradesh
మునిసిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ:
కర్నూలు : అవకతవకలకు పాల్పడితే ఇంటికే..• పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వీడండి•...
By Hari Krishna 2026-01-03 14:30:47 0 174
Andhra Pradesh
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే
BREAKING    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC ఛీఫ్    -...
By Rajini Kumari 2025-12-16 13:00:49 0 162
Telangana
MPTC, ZPTC elections are postponed...
As the grama panchayat elections are completed the telangana state election commission had...
By Krishna Balina 2025-12-22 13:58:32 0 180
Andhra Pradesh
ఏపీ ప్రజలకు శుభవార్త.. 25 సేవలు ఇంటి నుంచే, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా...
By John Baji 2026-02-05 11:15:19 0 176
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com