ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.

0
226

చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ తేదీ బుధవారం  బాపట్ల జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.జిల్లా పార్టీ అధ్యక్షులు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలతో సోమవారం వేటపాలెం మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియెజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు  పీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు.ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4 వ తేదీ బుధవారం పర్చూరు నియెజకవర్గం ఇంకొల్లు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి చీరాల నియెజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్త పేట గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని స్వష్టం చేశారు.కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారన్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మగాంధీ పేరు తొలగించి, పథకం పేరు మార్చిన వైనాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందన్నారు.అనంతరం కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై చర్చించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మార్పు గ్రెగొరీ ,ఏపీసీసీ మెంబర్ సయ్యద్ అల్లిం  బాబు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు ,మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు ,షేక్ రెహమాన్ ,మిరియాల శ్రీనివాస్, దేవరపల్లి బాబురావు ,AMC మాజీ డెరెక్టర్ కనపర్తి బజ్జిబాబు ,మేరిగ ఇస్సాక్, మేరిగ రమేష్ ,పులి శంకర్ తదితరాలు పాల్గొన్నారు .

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం గిరిజన చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం గిరిజన చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి...
By Chennaiah Kati 2026-01-26 15:54:23 0 215
SURAKSHA
West Bengal Police Green Drive Plants Thousands of Trees Every Year
 West Bengal Police contributes to environment through tree plantation drives. Officers and...
By Kalaga Sailaja 2026-07-01 13:23:15 0 70
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో రవిచంద్ర గారి సన్మానం
NTR జిల్లా టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొట్టిపాటి...
By Rajini Kumari 2025-12-25 10:54:08 0 291
Andhra Pradesh
మదనపల్లి : రెండేళ్ల బాలుడు పై వేట కుక్కల దాడి.
మదనపల్లి మండలం కొత్తవారిపల్లి పంచాయతీలో సోమవారం వీధిలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఎశ్విన్పై...
By Pagadala Venkateswar 2026-02-16 14:56:24 0 184
Andhra Pradesh
నది కైరవాడిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూమి రెవెన్యూ కన్ను
నదికైరవాడి శ్రీ ఆంజనేయ స్వామి భూముల సర్వేకు బ్రేక్.రెవెన్యూ మరియు ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం,...
By Boya Dasthagiri 2026-05-02 14:09:50 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com