ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.

0
171

చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ తేదీ బుధవారం  బాపట్ల జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.జిల్లా పార్టీ అధ్యక్షులు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలతో సోమవారం వేటపాలెం మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియెజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు  పీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు.ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4 వ తేదీ బుధవారం పర్చూరు నియెజకవర్గం ఇంకొల్లు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి చీరాల నియెజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్త పేట గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని స్వష్టం చేశారు.కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారన్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మగాంధీ పేరు తొలగించి, పథకం పేరు మార్చిన వైనాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందన్నారు.అనంతరం కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై చర్చించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మార్పు గ్రెగొరీ ,ఏపీసీసీ మెంబర్ సయ్యద్ అల్లిం  బాబు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు ,మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు ,షేక్ రెహమాన్ ,మిరియాల శ్రీనివాస్, దేవరపల్లి బాబురావు ,AMC మాజీ డెరెక్టర్ కనపర్తి బజ్జిబాబు ,మేరిగ ఇస్సాక్, మేరిగ రమేష్ ,పులి శంకర్ తదితరాలు పాల్గొన్నారు .

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.
    Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన...
By Pagadala Venkateswar 2026-02-11 09:16:42 0 111
Andhra Pradesh
మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.
మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్...
By Pagadala Venkateswar 2026-03-08 04:48:23 0 106
Telangana
నిజామాబాద్. డ్రైనేజీ లు క్లియర్
నిజామాబాద్‌ జిల్లా నెహెరునగర్‌లో శుక్రవారం గ్రామ సర్పంచ్‌ ఇమ్రాన్‌ అధ్వర్యంలో...
By Sadaq Sadaq 2026-03-06 17:29:50 0 137
Telangana
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
మరిపెడ, ఏప్రిల్ 10:తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుండి 10వ తరగతి...
By Bittu Bittu 2026-04-10 11:41:53 0 145
Andhra Pradesh
పుస్తకమే ప్రపంచాన్ని మార్చింది : రాఘవరెడ్డి
శుక్రవారం నాడు మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర...
By Pagadala Venkateswar 2026-02-28 06:33:37 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com