ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|

0
184

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సేవా పరమో ధర్మ ఫౌండేషన్ ఆదర్శప్రాయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా చల్లని తాగునీరు అందించే ఏర్పాట్లు చేసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్వాల్ సిఐ ప్రశాంత్ రిబ్బన్ కట్టింగ్ చేసి చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ తీవ్రతలో ప్రజలకు తాగునీరు అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సేవా పరమో ధర్మ ఫౌండేషన్ చేపట్టిన ఈ చలివేంద్రాల ఏర్పాటు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. వేసవి కాలంలో దాహార్తిని తీర్చే ఈ కార్యక్రమం స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Media Academy
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society Journalism Isn’t Just About Reporting News. It...
By Media Academy 2025-04-28 18:46:37 0 3K
Andhra Pradesh
డ్రోన్ నిఘాతో నేరాల నియంత్రణకు కట్టుదిట్ట చర్యలు: ఎస్పీ.
అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-04-02 05:44:51 0 114
Andhra Pradesh
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఈగిల్ సెల్.
అన్నమయ్య జిల్లా ఈగిల్ సెల్ ఆధ్వర్యంలో మదనపల్లిలోని రైజ్డ్ ఆన్ డెనిమ్ ఇండియా యూనిట్-2లో సోమవారం...
By Pagadala Venkateswar 2026-05-12 05:54:45 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com